బండ్ల గణేష్ పేరెత్తగానే అందరి ముఖాల్లో చిరు నవ్వులు పులుముకుంటాయి. సినిమాల్లో ఎప్పుడు కామెడీ పాత్రలే చేయడమే కాదు.. నిర్మాతగా మారాక కూడా వేదికలెక్కినపుడు ఫన్నీ స్పీచ్లతో కామెడీనే పండిస్తూ వచ్చాడు. చివరికి రాజకీయాల్లోకి వచ్చినా కూడా బండ్ల గణేష్ కామెడీని విడిచిపెట్టలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటా అని స్టేట్మెంట్ ఇచ్చి కామెడీకి లోటు లేకుండా చేశాడు. ఈ కామెడీ వల్లే అతణ్ని కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా తీసుకున్నట్లు లేదు. టికెట్ ఇవ్వలేదు.
రాజకీయాలకు టాటా చెప్పేసి మళ్లీ సినిమాల వైపు చూసిన గణేష్.. నిర్మాతగా రీఎంట్రీ కోసం సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే నటన మీదా దృష్టిపెట్టాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’లో చిన్న కామెడీ క్యారెక్టర్ చేసిన గణేష్.. ఏకంగా లీడ్ రోల్లో ‘డేగల బాబ్జీ’ అనే సినిమా చేయడం విశేషం.
నటుడిగా చాలా బిజీగా ఉన్న టైంలోనే లీడ్ రోల్ చేయని గణేష్.. కెరీర్లో ఈ దశలో హీరోగా నటించడం, ఆ సినిమాలో అతడిదొక్కడిదే క్యారెక్టర్ ఉండటం ఊహకందని విషయం. ‘ఒత్త సెరుపు సైజ్ 7’ అనే తమిళ చిత్రం ఆధారంగా ఈ సినిమా ప్రకటించినపుడే అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే తమిళంలో గొప్ప ప్రయోగంగా పేరు తెచ్చుకున్న సినిమా ఇది. అక్కడ మేటి నటుల్లో ఒకడిగా పేరున్న పార్తీబన్ తనే లీడ్ రోల్లో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో సినిమాను నిర్మించాడు. అలాంటి పాత్రకు ఇక్కడ మంచి నటులను, ముఖ్యంగా సీరియస్ పాత్రలకు సూటయ్యే వాళ్లను తీసుకుంటే బాగుండేదేమో. బండ్ల గణేష్ బాగా చేయడని కాదు కానీ.. అతడికున్న ‘కామెడీ’ ఇమేజ్ ఈ పాత్రకు ప్రతిబంధకంలా కనిపిస్తోంది. పైగా గణేష్ నటనకు చాలా ఏళ్లు దూరంగా ఉండటం వల్ల మార్కెట్ పరంగా కూడా దీనికి మైనస్సే. అతనొక్కడే కనిపించే సినిమాను థియేటర్లకొచ్చి జనాలు చూస్తారా అన్నది సందేహం.
ఓటీటీలో అయినా సరే.. ప్రేక్షకులను ఇలాంటి సినిమాలకు ఆకర్షితుల్ని చేయడం కష్టమే. ఏకపాత్రాభినయంతో సాగే ఈ పాత్రను గొప్ప నటుడెవరైనా చేస్తే తప్ప ఇలాంటి సినిమాపై ఆసక్తిని అంతసేపు సస్టైన్ చేయడం చాలా కష్టం. ట్రైలర్ చూస్తే గణేష్ ఈ సినిమాకు మైనస్ అనే అభిప్రాయం కలుగుతోంది. మరి ఈ అంచనాలను ‘డేగల బాబ్జీ’తో బండ్ల గణేష్ అండ్ కో మెప్పించగలిగితే గ్రేటే.
This post was last modified on November 8, 2021 2:18 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…