బండ్ల గణేష్ పేరెత్తగానే అందరి ముఖాల్లో చిరు నవ్వులు పులుముకుంటాయి. సినిమాల్లో ఎప్పుడు కామెడీ పాత్రలే చేయడమే కాదు.. నిర్మాతగా మారాక కూడా వేదికలెక్కినపుడు ఫన్నీ స్పీచ్లతో కామెడీనే పండిస్తూ వచ్చాడు. చివరికి రాజకీయాల్లోకి వచ్చినా కూడా బండ్ల గణేష్ కామెడీని విడిచిపెట్టలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటా అని స్టేట్మెంట్ ఇచ్చి కామెడీకి లోటు లేకుండా చేశాడు. ఈ కామెడీ వల్లే అతణ్ని కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా తీసుకున్నట్లు లేదు. టికెట్ ఇవ్వలేదు.
రాజకీయాలకు టాటా చెప్పేసి మళ్లీ సినిమాల వైపు చూసిన గణేష్.. నిర్మాతగా రీఎంట్రీ కోసం సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే నటన మీదా దృష్టిపెట్టాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’లో చిన్న కామెడీ క్యారెక్టర్ చేసిన గణేష్.. ఏకంగా లీడ్ రోల్లో ‘డేగల బాబ్జీ’ అనే సినిమా చేయడం విశేషం.
నటుడిగా చాలా బిజీగా ఉన్న టైంలోనే లీడ్ రోల్ చేయని గణేష్.. కెరీర్లో ఈ దశలో హీరోగా నటించడం, ఆ సినిమాలో అతడిదొక్కడిదే క్యారెక్టర్ ఉండటం ఊహకందని విషయం. ‘ఒత్త సెరుపు సైజ్ 7’ అనే తమిళ చిత్రం ఆధారంగా ఈ సినిమా ప్రకటించినపుడే అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే తమిళంలో గొప్ప ప్రయోగంగా పేరు తెచ్చుకున్న సినిమా ఇది. అక్కడ మేటి నటుల్లో ఒకడిగా పేరున్న పార్తీబన్ తనే లీడ్ రోల్లో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో సినిమాను నిర్మించాడు. అలాంటి పాత్రకు ఇక్కడ మంచి నటులను, ముఖ్యంగా సీరియస్ పాత్రలకు సూటయ్యే వాళ్లను తీసుకుంటే బాగుండేదేమో. బండ్ల గణేష్ బాగా చేయడని కాదు కానీ.. అతడికున్న ‘కామెడీ’ ఇమేజ్ ఈ పాత్రకు ప్రతిబంధకంలా కనిపిస్తోంది. పైగా గణేష్ నటనకు చాలా ఏళ్లు దూరంగా ఉండటం వల్ల మార్కెట్ పరంగా కూడా దీనికి మైనస్సే. అతనొక్కడే కనిపించే సినిమాను థియేటర్లకొచ్చి జనాలు చూస్తారా అన్నది సందేహం.
ఓటీటీలో అయినా సరే.. ప్రేక్షకులను ఇలాంటి సినిమాలకు ఆకర్షితుల్ని చేయడం కష్టమే. ఏకపాత్రాభినయంతో సాగే ఈ పాత్రను గొప్ప నటుడెవరైనా చేస్తే తప్ప ఇలాంటి సినిమాపై ఆసక్తిని అంతసేపు సస్టైన్ చేయడం చాలా కష్టం. ట్రైలర్ చూస్తే గణేష్ ఈ సినిమాకు మైనస్ అనే అభిప్రాయం కలుగుతోంది. మరి ఈ అంచనాలను ‘డేగల బాబ్జీ’తో బండ్ల గణేష్ అండ్ కో మెప్పించగలిగితే గ్రేటే.
This post was last modified on November 8, 2021 2:18 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…