బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో చాలా రోజులపాటు కస్టడీలో ఉంచారు ఎన్సీబీ అధికారులు. ఆర్యన్ ఎన్నిసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా.. దొరకలేదు. ఫైనల్ గా కొన్ని కండిషన్స్ మీద కోర్టు ఆర్యన్ కు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో రకరకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్యన్ ను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ ముంబై జోనల్ ఆఫీసర్ సమీర్ వాంఖేడే విషయంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్యన్ ను అరెస్ట్ చేయడానికి ముందు సమీర్ డబ్బులు డిమాండ్ చేశాడనే విషయం కోర్టు వరకు వెళ్లింది.
ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని.. ఆర్యన్ ను ఈ కేసులో సమీర్ వాఖేండే కావాలనే ఫ్రేమ్ చేశాడనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. మరోపక్క ఈ కేసుపై సిట్ విచారణ కూడా మొదలైంది. ఈ కేసులో ఎన్సీబీపై కూడా విమర్శలు వస్తుండడంతో.. విచారణకు సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ ఆఫీసర్లు ఈ కేసులోని నిందితులను విచారిస్తున్నారు. ఇప్పటికే అర్భాజ్ మర్చంట్ ను సిట్ అధికారులు విచారించారు.
ఆదివారం నాడు షారుఖ్ తనయుడు ఆర్యన్ ను కూడా విచారణకు పిలిచారట ఎన్సీబీ-సిట్ అధికారులు. అయితే అనారోగ్యంగా ఉందని ఆర్యన్ విచారణ నుంచి మినహాయింపుని కోరినట్లుగా సమాచారం. సోమవారం నాడు ఆర్యన్ సిట్ విచారణకు హాజరు కావొచ్చని తెలుస్తోంది. బెయిల్ మీద బయటకొచ్చినా కూడా ఈ కేసు వ్యవహారం ఆర్యన్ ను అంత ఈజీగా వదిలేలా లేదు.
This post was last modified on November 8, 2021 11:31 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…