బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో చాలా రోజులపాటు కస్టడీలో ఉంచారు ఎన్సీబీ అధికారులు. ఆర్యన్ ఎన్నిసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా.. దొరకలేదు. ఫైనల్ గా కొన్ని కండిషన్స్ మీద కోర్టు ఆర్యన్ కు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో రకరకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్యన్ ను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ ముంబై జోనల్ ఆఫీసర్ సమీర్ వాంఖేడే విషయంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్యన్ ను అరెస్ట్ చేయడానికి ముందు సమీర్ డబ్బులు డిమాండ్ చేశాడనే విషయం కోర్టు వరకు వెళ్లింది.
ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని.. ఆర్యన్ ను ఈ కేసులో సమీర్ వాఖేండే కావాలనే ఫ్రేమ్ చేశాడనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. మరోపక్క ఈ కేసుపై సిట్ విచారణ కూడా మొదలైంది. ఈ కేసులో ఎన్సీబీపై కూడా విమర్శలు వస్తుండడంతో.. విచారణకు సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ ఆఫీసర్లు ఈ కేసులోని నిందితులను విచారిస్తున్నారు. ఇప్పటికే అర్భాజ్ మర్చంట్ ను సిట్ అధికారులు విచారించారు.
ఆదివారం నాడు షారుఖ్ తనయుడు ఆర్యన్ ను కూడా విచారణకు పిలిచారట ఎన్సీబీ-సిట్ అధికారులు. అయితే అనారోగ్యంగా ఉందని ఆర్యన్ విచారణ నుంచి మినహాయింపుని కోరినట్లుగా సమాచారం. సోమవారం నాడు ఆర్యన్ సిట్ విచారణకు హాజరు కావొచ్చని తెలుస్తోంది. బెయిల్ మీద బయటకొచ్చినా కూడా ఈ కేసు వ్యవహారం ఆర్యన్ ను అంత ఈజీగా వదిలేలా లేదు.
This post was last modified on November 8, 2021 11:31 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…