బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో చాలా రోజులపాటు కస్టడీలో ఉంచారు ఎన్సీబీ అధికారులు. ఆర్యన్ ఎన్నిసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా.. దొరకలేదు. ఫైనల్ గా కొన్ని కండిషన్స్ మీద కోర్టు ఆర్యన్ కు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో రకరకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్యన్ ను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ ముంబై జోనల్ ఆఫీసర్ సమీర్ వాంఖేడే విషయంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్యన్ ను అరెస్ట్ చేయడానికి ముందు సమీర్ డబ్బులు డిమాండ్ చేశాడనే విషయం కోర్టు వరకు వెళ్లింది.
ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని.. ఆర్యన్ ను ఈ కేసులో సమీర్ వాఖేండే కావాలనే ఫ్రేమ్ చేశాడనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. మరోపక్క ఈ కేసుపై సిట్ విచారణ కూడా మొదలైంది. ఈ కేసులో ఎన్సీబీపై కూడా విమర్శలు వస్తుండడంతో.. విచారణకు సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ ఆఫీసర్లు ఈ కేసులోని నిందితులను విచారిస్తున్నారు. ఇప్పటికే అర్భాజ్ మర్చంట్ ను సిట్ అధికారులు విచారించారు.
ఆదివారం నాడు షారుఖ్ తనయుడు ఆర్యన్ ను కూడా విచారణకు పిలిచారట ఎన్సీబీ-సిట్ అధికారులు. అయితే అనారోగ్యంగా ఉందని ఆర్యన్ విచారణ నుంచి మినహాయింపుని కోరినట్లుగా సమాచారం. సోమవారం నాడు ఆర్యన్ సిట్ విచారణకు హాజరు కావొచ్చని తెలుస్తోంది. బెయిల్ మీద బయటకొచ్చినా కూడా ఈ కేసు వ్యవహారం ఆర్యన్ ను అంత ఈజీగా వదిలేలా లేదు.
This post was last modified on November 8, 2021 11:31 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…