ఒకే కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు తెరకెక్కడం అరుదు. ఇప్పుడు టాలీవుడ్లో అదే జరగబోతోంది. ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతంలో దోపిడీలతో హడలెత్తించిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఇంతకుముందే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘స్టువర్టుపురం దొంగ’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కేఎస్ అనే దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు.
ఇప్పుడు ఇదే కథతో ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిలే పెట్టి రవితేజ ప్రధాన పాత్రలో సినిమాను ప్రకటించారు. దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రాల దర్శకుడు వంశీ ఆకెళ్ల దీనికి డైరెక్టర్. అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించనుంది. ఐతే ఒకే కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు వస్తే ప్రేక్షకులు దేనికి పట్టం కడతారు.. రెండింట్లో ఏది పైచేయి సాధిస్తుంది అన్నది ఆసక్తికరం.
ప్రస్తుతానికైతే రవితేజ చేస్తున్న సినిమా ఏ రకంగా చూసినా మెరుగైన స్థితిలో ఉంది. దీని కాస్ట్ అండ్ క్రూ రేంజ్ వేరు. అలాగని ఈ ఆకర్షణలు మాత్రమే సినిమాకు విజయం చేకూర్చలేవు. పకడ్బందీగా ఎవరు సినిమా తీస్తారన్నది ముఖ్యం. ఐతే ఈ రెండు చిత్రాల్లో మొదట రిలీజయ్యేదానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ముందు వచ్చిన సినిమాకు మంచి టాక్ వస్తే జనాలు బాగా చూస్తారు. ఆ తర్వాత రిలీజయ్యే సినిమా పట్ల ఆసక్తి తగ్గిపోతుంది.
గత ఏడాది హిందీలో హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా ‘స్కామ్ 1992’ అనే వెబ్ సిరీస్ వచ్చి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. అదే సమయంలో అభిషేక్ బచ్చన్ హీరోగా హర్షద్ కథతో ‘బిగ్ బుల్’ అనే సినిమా తీశారు. ‘స్కామ్ 1992’ ముందే రిలీజై అద్భుత ఫలితాన్నందుకోవడంతో ‘బిగ్ బుల్’ మీద ఆసక్తి తగ్గిపోయింది. హాట్ స్టార్లో రిలీజైతే ఈ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి తమ సినిమానే ముందు రిలీజ్ చేయాలని రెండు చిత్రాల బృందాలు పోటీ పడి వేగంగా సినిమాను పూర్తి చేసి విడుదల చేయడానికి ప్రయత్నించే అవకాశముంది.
This post was last modified on November 8, 2021 10:06 am
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…