సుకుమార్, అల్లు అర్జున్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఈ చిత్ర విడుదలకు ఇంకో ఇటుగా 40 రోజుల సమయమే మిగిలుంది. డిసెంబరు 17న ‘పుష్ప: ది రైజ్’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఐతే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటిదాకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు.
ఇంకా కొంత టాకీ పార్ట్ మిగిలి ఉంది. అలాగే ఒక పాటను భారీ స్థాయిలో చిత్రీకరించాల్సి ఉంది. ఇందుకు ఇంకో రెండు వారాలైనా సమయం పట్టేలా ఉంది. ఆ తర్వాత మిగిలిన మూణ్నాలుగు వారాల్లో ఐదు భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాను అనుకున్న ప్రకారం విడుదలకు సిద్ధం చేయడం అంటే అంత తేలిక కాదు. ఐతే ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి డెడ్ లైన్ అందుకోవాల్సిందే అని దర్శకుడు సుకుమార్ రేయింబవళ్లు కష్టపడుతున్నట్లు సమాచారం.
సినిమాలో మిగిలిన చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణను వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షిస్తూ సుకుమార్ తన అసిస్టెంట్లతో షూట్ చేయిస్తున్నట్లు సమాచారం. ఆయన సినిమా ఎడిటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ప్రతి సన్నివేశాన్ని రకరకాల యాంగిల్స్లో, డిఫరెంట్ షాట్స్ తీయడం సుకుమార్కు అలవాటు. వాటిలోంచి ఎడిటింగ్ టైంలో బెస్ట్ షాట్ ఎంచుకుని మిక్సింగ్ చేయిస్తాడు. దీని వల్ల సుక్కు సినిమాల ఎడిటింగ్కు చాలా సమయం పడుతుంటుంది.
కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ టైంలో అంతకుముందు షూట్ చేసిన రషెస్ను కొంత మేర ఎడిటింగ్ చేసుకున్న సుక్కు.. ఇప్పుడు పూర్తి స్థాయి ఎడిటింగ్లో మునిగిపోయాడు. అలాగే వివిధ భాషల్లో డబ్బింగ్ పనులనూ పర్యవేక్షిస్తున్నాడు. మిగతా భాషల కంటే చిత్తూరు యాసలో సాగే తెలుగు డబ్బింగ్ వర్క్కే చాలా టైం పడుతున్నట్లు సమాచారం. ఎంత కష్టమైనా.. రేయింబవళ్లు కష్టపడైనా డిసెంబరు 17కు సినిమాను విడుదలకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో అడుగులేస్తున్న సుకుమార్ ఆ ప్రయత్నంలో ఏమేర విజయవంతం అవుతాడో చూడాలి.
This post was last modified on November 7, 2021 4:50 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…