సుకుమార్, అల్లు అర్జున్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఈ చిత్ర విడుదలకు ఇంకో ఇటుగా 40 రోజుల సమయమే మిగిలుంది. డిసెంబరు 17న ‘పుష్ప: ది రైజ్’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఐతే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటిదాకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు.
ఇంకా కొంత టాకీ పార్ట్ మిగిలి ఉంది. అలాగే ఒక పాటను భారీ స్థాయిలో చిత్రీకరించాల్సి ఉంది. ఇందుకు ఇంకో రెండు వారాలైనా సమయం పట్టేలా ఉంది. ఆ తర్వాత మిగిలిన మూణ్నాలుగు వారాల్లో ఐదు భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాను అనుకున్న ప్రకారం విడుదలకు సిద్ధం చేయడం అంటే అంత తేలిక కాదు. ఐతే ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి డెడ్ లైన్ అందుకోవాల్సిందే అని దర్శకుడు సుకుమార్ రేయింబవళ్లు కష్టపడుతున్నట్లు సమాచారం.
సినిమాలో మిగిలిన చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణను వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షిస్తూ సుకుమార్ తన అసిస్టెంట్లతో షూట్ చేయిస్తున్నట్లు సమాచారం. ఆయన సినిమా ఎడిటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ప్రతి సన్నివేశాన్ని రకరకాల యాంగిల్స్లో, డిఫరెంట్ షాట్స్ తీయడం సుకుమార్కు అలవాటు. వాటిలోంచి ఎడిటింగ్ టైంలో బెస్ట్ షాట్ ఎంచుకుని మిక్సింగ్ చేయిస్తాడు. దీని వల్ల సుక్కు సినిమాల ఎడిటింగ్కు చాలా సమయం పడుతుంటుంది.
కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ టైంలో అంతకుముందు షూట్ చేసిన రషెస్ను కొంత మేర ఎడిటింగ్ చేసుకున్న సుక్కు.. ఇప్పుడు పూర్తి స్థాయి ఎడిటింగ్లో మునిగిపోయాడు. అలాగే వివిధ భాషల్లో డబ్బింగ్ పనులనూ పర్యవేక్షిస్తున్నాడు. మిగతా భాషల కంటే చిత్తూరు యాసలో సాగే తెలుగు డబ్బింగ్ వర్క్కే చాలా టైం పడుతున్నట్లు సమాచారం. ఎంత కష్టమైనా.. రేయింబవళ్లు కష్టపడైనా డిసెంబరు 17కు సినిమాను విడుదలకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో అడుగులేస్తున్న సుకుమార్ ఆ ప్రయత్నంలో ఏమేర విజయవంతం అవుతాడో చూడాలి.
This post was last modified on November 7, 2021 4:50 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…