సుకుమార్, అల్లు అర్జున్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఈ చిత్ర విడుదలకు ఇంకో ఇటుగా 40 రోజుల సమయమే మిగిలుంది. డిసెంబరు 17న ‘పుష్ప: ది రైజ్’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఐతే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటిదాకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు.
ఇంకా కొంత టాకీ పార్ట్ మిగిలి ఉంది. అలాగే ఒక పాటను భారీ స్థాయిలో చిత్రీకరించాల్సి ఉంది. ఇందుకు ఇంకో రెండు వారాలైనా సమయం పట్టేలా ఉంది. ఆ తర్వాత మిగిలిన మూణ్నాలుగు వారాల్లో ఐదు భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాను అనుకున్న ప్రకారం విడుదలకు సిద్ధం చేయడం అంటే అంత తేలిక కాదు. ఐతే ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి డెడ్ లైన్ అందుకోవాల్సిందే అని దర్శకుడు సుకుమార్ రేయింబవళ్లు కష్టపడుతున్నట్లు సమాచారం.
సినిమాలో మిగిలిన చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణను వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షిస్తూ సుకుమార్ తన అసిస్టెంట్లతో షూట్ చేయిస్తున్నట్లు సమాచారం. ఆయన సినిమా ఎడిటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ప్రతి సన్నివేశాన్ని రకరకాల యాంగిల్స్లో, డిఫరెంట్ షాట్స్ తీయడం సుకుమార్కు అలవాటు. వాటిలోంచి ఎడిటింగ్ టైంలో బెస్ట్ షాట్ ఎంచుకుని మిక్సింగ్ చేయిస్తాడు. దీని వల్ల సుక్కు సినిమాల ఎడిటింగ్కు చాలా సమయం పడుతుంటుంది.
కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ టైంలో అంతకుముందు షూట్ చేసిన రషెస్ను కొంత మేర ఎడిటింగ్ చేసుకున్న సుక్కు.. ఇప్పుడు పూర్తి స్థాయి ఎడిటింగ్లో మునిగిపోయాడు. అలాగే వివిధ భాషల్లో డబ్బింగ్ పనులనూ పర్యవేక్షిస్తున్నాడు. మిగతా భాషల కంటే చిత్తూరు యాసలో సాగే తెలుగు డబ్బింగ్ వర్క్కే చాలా టైం పడుతున్నట్లు సమాచారం. ఎంత కష్టమైనా.. రేయింబవళ్లు కష్టపడైనా డిసెంబరు 17కు సినిమాను విడుదలకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో అడుగులేస్తున్న సుకుమార్ ఆ ప్రయత్నంలో ఏమేర విజయవంతం అవుతాడో చూడాలి.
This post was last modified on November 7, 2021 4:50 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…