దురాభిమానుల పైత్యానికి బలైపోతోంది… మీరా చోప్రా. ‘ఎన్టీఆర్ గురించి నాకు తెలీదు’ అన్న పాపానికి… సోషల్ మీడియా సాక్షిగా, ఎన్టీఆర్ దురాభిమానుల చేతుల్లో మీరా పరువు అభాసుపాలైపోతోంది.
దీనిపై స్పందించాలని ఎన్టీఆర్ని మీరా కోరినా.. ఫలితం లేకుండా పోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మీరాకు మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. నెటిజన్లు.. మీరాకు వెన్నుదన్నుగా నిలిచారు.
కానీ ఇలాంటి సమయంలో మాట్లాడాల్సిన కథానాయికలే ఇంకా నోరు మెదపడం లేదు. సాధారణంగా మహిళలపై అకృత్యాలు, అన్యాయాలు జరిగినప్పుడు ట్విట్టర్లు బెంబేలెత్తేలా, సోషల్ మీడియా.. హడలిపోయేలా పోస్టింగులు చేస్తుంటారు కథానాయికలు.
మరి.. మీరా చోప్రా విషయంలో వాళ్లెందుకు నోరు మెదపడం లేదో అర్థం కావడం లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే, ఎన్టీఆర్ తోపెట్టుకున్నట్టే అని భయపడుతున్నారా? లేదంటే ‘మా వరకూ రాలేదు కదా’ అని లైట్ తీసుకుంటున్నారా? మీరా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్. అదే ఫామ్ లో ఉన్న హీరోయిన్ని ఎవరైనా ఏమైనా అంటే… ఈ గ్యాంగ్ అంతా ఊరుకునేదా? ఏదో విధంగా… సపోర్ట్ చేసేవారు కదా. ఆ మద్దతే మీరా చోప్రాకి ఇప్పుడు కరువైంది.
ఇలాంటి విషయాల్లో చురుగ్గా స్పందించే సమంత లాంటి వాళ్లు కూడా మౌనంగా ఉండడం… ఆశ్చర్యం కలిగిస్తోంది. మునుముందైనా ఎవరైనా నోరు విప్పుతారేమో చూడాలి.
This post was last modified on June 5, 2020 1:30 pm
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…