ఈ మధ్యకాలంలో సినిమాల్లో హీరోల కంటే విలన్స్ ను మరింత బలంగా చూపిస్తున్నారు. అలా చూపిస్తే హీరో క్యారెక్టర్ కు మరింత ఎలివేషన్ వస్తుంది. అందుకే మన సినిమాల్లో హీరో క్యారెక్టర్ కు ధీటుగా విలన్స్ ను తీసుకుంటున్నారు. ఇంతకముందు అంటే ఉన్న విలన్స్ నే అలా రిపీట్ చేసేవాళ్లు కానీ ఇప్పుడు వేరే ఇండస్ట్రీల నుంచి నటీనటుల్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తమిళ, మలయాళ నటులు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు.
ఇప్పుడొక కన్నడ నటుడు తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా మైత్రి మూవీస్ సంస్థ ఓ సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ ను ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కన్నడలో ‘దునియా’ అనే సినిమాతో పాపులర్ అవ్వడంతో అతడికి దునియా విజయ్ అనే పేరొచ్చింది.
ఇప్పుడు అతడిని బాలయ్య సినిమాలో విలన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తను చివరిగా తెరకెక్కించిన ‘క్రాక్’ సినిమాలో మెయిన్ విలన్స్ సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ లను కోలీవుడ్ నుంచి తీసుకొచ్చారు. ఈసారి కన్నడ ఇండస్ట్రీ నుంచి విలన్ ను ఎంపిక చేసుకున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ కి తెలుగులో ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!
This post was last modified on November 5, 2021 8:47 pm
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…