ఈ మధ్యకాలంలో సినిమాల్లో హీరోల కంటే విలన్స్ ను మరింత బలంగా చూపిస్తున్నారు. అలా చూపిస్తే హీరో క్యారెక్టర్ కు మరింత ఎలివేషన్ వస్తుంది. అందుకే మన సినిమాల్లో హీరో క్యారెక్టర్ కు ధీటుగా విలన్స్ ను తీసుకుంటున్నారు. ఇంతకముందు అంటే ఉన్న విలన్స్ నే అలా రిపీట్ చేసేవాళ్లు కానీ ఇప్పుడు వేరే ఇండస్ట్రీల నుంచి నటీనటుల్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తమిళ, మలయాళ నటులు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు.
ఇప్పుడొక కన్నడ నటుడు తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా మైత్రి మూవీస్ సంస్థ ఓ సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ ను ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కన్నడలో ‘దునియా’ అనే సినిమాతో పాపులర్ అవ్వడంతో అతడికి దునియా విజయ్ అనే పేరొచ్చింది.
ఇప్పుడు అతడిని బాలయ్య సినిమాలో విలన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తను చివరిగా తెరకెక్కించిన ‘క్రాక్’ సినిమాలో మెయిన్ విలన్స్ సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ లను కోలీవుడ్ నుంచి తీసుకొచ్చారు. ఈసారి కన్నడ ఇండస్ట్రీ నుంచి విలన్ ను ఎంపిక చేసుకున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ కి తెలుగులో ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!
This post was last modified on November 5, 2021 8:47 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…