ఈ మధ్యకాలంలో సినిమాల్లో హీరోల కంటే విలన్స్ ను మరింత బలంగా చూపిస్తున్నారు. అలా చూపిస్తే హీరో క్యారెక్టర్ కు మరింత ఎలివేషన్ వస్తుంది. అందుకే మన సినిమాల్లో హీరో క్యారెక్టర్ కు ధీటుగా విలన్స్ ను తీసుకుంటున్నారు. ఇంతకముందు అంటే ఉన్న విలన్స్ నే అలా రిపీట్ చేసేవాళ్లు కానీ ఇప్పుడు వేరే ఇండస్ట్రీల నుంచి నటీనటుల్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తమిళ, మలయాళ నటులు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు.
ఇప్పుడొక కన్నడ నటుడు తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా మైత్రి మూవీస్ సంస్థ ఓ సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ ను ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కన్నడలో ‘దునియా’ అనే సినిమాతో పాపులర్ అవ్వడంతో అతడికి దునియా విజయ్ అనే పేరొచ్చింది.
ఇప్పుడు అతడిని బాలయ్య సినిమాలో విలన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తను చివరిగా తెరకెక్కించిన ‘క్రాక్’ సినిమాలో మెయిన్ విలన్స్ సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ లను కోలీవుడ్ నుంచి తీసుకొచ్చారు. ఈసారి కన్నడ ఇండస్ట్రీ నుంచి విలన్ ను ఎంపిక చేసుకున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ కి తెలుగులో ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!
This post was last modified on November 5, 2021 8:47 pm
మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…
ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…
రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ కార్తికేయ 2తో పెద్ద బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న యూత్…
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది…
ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ…