ఈ మధ్యకాలంలో సినిమాల్లో హీరోల కంటే విలన్స్ ను మరింత బలంగా చూపిస్తున్నారు. అలా చూపిస్తే హీరో క్యారెక్టర్ కు మరింత ఎలివేషన్ వస్తుంది. అందుకే మన సినిమాల్లో హీరో క్యారెక్టర్ కు ధీటుగా విలన్స్ ను తీసుకుంటున్నారు. ఇంతకముందు అంటే ఉన్న విలన్స్ నే అలా రిపీట్ చేసేవాళ్లు కానీ ఇప్పుడు వేరే ఇండస్ట్రీల నుంచి నటీనటుల్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తమిళ, మలయాళ నటులు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు.
ఇప్పుడొక కన్నడ నటుడు తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా మైత్రి మూవీస్ సంస్థ ఓ సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ ను ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కన్నడలో ‘దునియా’ అనే సినిమాతో పాపులర్ అవ్వడంతో అతడికి దునియా విజయ్ అనే పేరొచ్చింది.
ఇప్పుడు అతడిని బాలయ్య సినిమాలో విలన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తను చివరిగా తెరకెక్కించిన ‘క్రాక్’ సినిమాలో మెయిన్ విలన్స్ సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ లను కోలీవుడ్ నుంచి తీసుకొచ్చారు. ఈసారి కన్నడ ఇండస్ట్రీ నుంచి విలన్ ను ఎంపిక చేసుకున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ కి తెలుగులో ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!
This post was last modified on November 5, 2021 8:47 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…