Movie News

తెరపై సూర్య హీరో.. రియల్ హీరో ఆయన

జై భీమ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నోళ్లలో నానుతున్న సినిమా. తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో జ్ఞానవేల్ రూపొందించిన చిత్రమిది. ‘జై భీమ్’ను స్వయంగా సూర్యనే తన ‘2డీ ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద నిర్మించడం విశేషం. తమిళనాడులో 90వ దశకంలో జరిగిన ఒక లాకప్ డెత్ ఆధారంగా కథను అల్లుకుని ఎంతో పకడ్బందీగా, హృద్యంగా ఈ సినిమాను తెరకెక్కించిన ప్రశంసలు అందుకుంటున్నాడు జ్ఞానవేల్.

ఇలాంటి సినిమాకు నిర్మాతగా అండగా నిలవడమే కాక.. అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన సూర్య మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐతే తెరమీద సూర్య హీరో అయితే.. రియల్ హీరో మాత్రం ఇంకొకరున్నారు. ఆయనే చంద్రు. సూర్య పోషించింది ఈయన పాత్రే కావడం విశేషం. ఒక గిరిజన యువకుడి లాకప్ డెత్‌ గురించి తెలుసుకుని కదిలిపోయి అతడికి, తన కుటుంబానికి న్యాయం చేయడానికి అలుపెరగని పోరాటం చేసిన వైనాన్నే సినిమాలో చూపించారు.

ఐతే చంద్రు గొప్పదనం ఈ ఒక్క కేసుకు పరిమితం కాదు. ఆయన తన న్యాయవాద వృత్తిలో ఉండగా వాదించిన ఏ మానవ హక్కుల కేసుకూ ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు. గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వాళ్ల కోసం ఎన్నో కేసులు ఆయన వాదించి వారికి న్యాయం చేశారు. ఎంతోమందికి నష్ట పరిహారాలు అందేలా చూశారు. తర్వాత చంద్రు జడ్జి కూడా కావడం విశేషం. అప్పుడు కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. కోర్టులో జడ్జినుద్దేశించి ‘మై లార్డ్’ అని సంబోధించడాన్ని తన వరకు నివారించారు.

జడ్జిగా ఆరేళ్ల వ్యవధిలో 96 వేలకు పైగా కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించారు. మహిళలు దేవాలయాల్లో పూజారులుగా వ్యవహరించవచ్చని, కులం ఏదైనా అందరికీ ఒకే శ్మశానం ఉండాలని, దళితులకు శ్మశానంలో వేరే స్థలం కేటాయించడం నిషిద్ధమని.. ఇలా విప్లవాత్మక తీర్పులెన్నో ఇచ్చారు చంద్రు. పదవీ విరమణకు ముందు, తర్వాత తన ఆస్తులను ప్రకటించడం ద్వారా ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు ఆయన వాదించిన ఒక సంచలన కేసు ఆధారంగా ‘జై భీమ్’ సినిమా తీసి చంద్రు గురించి ప్రపంచానికి తెలిసేలా చేశారు సూర్య, జ్ఞానవేల్.

This post was last modified on November 4, 2021 8:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

7 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

33 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago