ఎట్టకేలకి మాస్ మహరాజా ఫ్యాన్స్ పండగ చేసుకునే రోజు వచ్చేసింది. రవితేజ కూడా ప్యాన్ ఇండియా ఫిల్మ్ ప్రకటించాడు. వంశీ డైరెక్షన్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్లో నటించడానికి కమిటయ్యాడు. ‘క్రాక్’ సక్సెస్ తర్వాత వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ, ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని పట్టాలెక్కిస్తూ చెప్పలేనంత జోష్ మీదున్నాడు రవితేజ. రీసెంట్గా సుధీర్వర్మ డైరెక్షన్లో తన డెబ్భయ్యో సినిమాని ప్రకటించాడు. తన డెబ్భై ఒకటో సినిమాని కూడా ప్రకటిస్తాడని తెలియగానే అది ఏ మూవీ అయ్యుంటుందా అని అంచనా వేసే పనిలో పడ్డారు ఫ్యాన్స్. ఆ సస్పెన్స్కి ఇప్పుడు తెర దించేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీని అనౌన్స్ చేశాడు.
1970 ప్రాంతంలో స్టువర్ట్పురంలో పేరు మోసిన దొంగ నాగేశ్వరరావు. పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా దొరికేవాడు కాదు. పోలీసులకు చుక్కలు చూపించి టైగర్ నాగేశ్వరరావుగా పాపులర్ అయ్యాడు. అతని జీవితంపై సినిమా తీసేందుకు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నాడు వంశీ. బెల్లంకొండ శ్రీనివాస్తో తీయబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ చివరికి ఆ ప్రాజెక్ట్ రవితేజ చేతికి వచ్చింది. అభిషేక్ అగర్వాల్ ప్యాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్, మధి లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.
ఈ పాత్ర కోసం రవితేజ పూర్తిగా మేకోవర్ అవుతున్నాడట. తన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్.. అన్నీ కొత్తగా, సర్ప్రైజింగ్గా ఉంటాయని చెబుతున్నారు. అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంటరెస్టింగ్గా ఉంది. ఇందులో నాగేశ్వరరావు కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అతను నడచుకుంటూ వెళ్తున్నాడు. పాదముద్రలు మాత్రం అతనివి కాదు.. టైగర్వి. ‘ఫీల్ ద సైలెన్స్ బిఫోర్ ద హంట్’ అనే క్యాప్షన్తో సినిమాపై మంచి ఫీల్ని కూడా కలిగించే ప్రయత్నం చేశారు. ఇంతవరకు మాస్ సినిమాలతో, ఫిక్షనల్ క్యారెక్టర్స్తో అదరగొట్టిన రవితేజ.. ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్లో ఎలా ఉంటాడో చూడాల్సిందే.
This post was last modified on November 4, 2021 4:31 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…