ఎట్టకేలకి మాస్ మహరాజా ఫ్యాన్స్ పండగ చేసుకునే రోజు వచ్చేసింది. రవితేజ కూడా ప్యాన్ ఇండియా ఫిల్మ్ ప్రకటించాడు. వంశీ డైరెక్షన్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్లో నటించడానికి కమిటయ్యాడు. ‘క్రాక్’ సక్సెస్ తర్వాత వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ, ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని పట్టాలెక్కిస్తూ చెప్పలేనంత జోష్ మీదున్నాడు రవితేజ. రీసెంట్గా సుధీర్వర్మ డైరెక్షన్లో తన డెబ్భయ్యో సినిమాని ప్రకటించాడు. తన డెబ్భై ఒకటో సినిమాని కూడా ప్రకటిస్తాడని తెలియగానే అది ఏ మూవీ అయ్యుంటుందా అని అంచనా వేసే పనిలో పడ్డారు ఫ్యాన్స్. ఆ సస్పెన్స్కి ఇప్పుడు తెర దించేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీని అనౌన్స్ చేశాడు.
1970 ప్రాంతంలో స్టువర్ట్పురంలో పేరు మోసిన దొంగ నాగేశ్వరరావు. పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా దొరికేవాడు కాదు. పోలీసులకు చుక్కలు చూపించి టైగర్ నాగేశ్వరరావుగా పాపులర్ అయ్యాడు. అతని జీవితంపై సినిమా తీసేందుకు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నాడు వంశీ. బెల్లంకొండ శ్రీనివాస్తో తీయబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ చివరికి ఆ ప్రాజెక్ట్ రవితేజ చేతికి వచ్చింది. అభిషేక్ అగర్వాల్ ప్యాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్, మధి లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.
ఈ పాత్ర కోసం రవితేజ పూర్తిగా మేకోవర్ అవుతున్నాడట. తన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్.. అన్నీ కొత్తగా, సర్ప్రైజింగ్గా ఉంటాయని చెబుతున్నారు. అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంటరెస్టింగ్గా ఉంది. ఇందులో నాగేశ్వరరావు కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అతను నడచుకుంటూ వెళ్తున్నాడు. పాదముద్రలు మాత్రం అతనివి కాదు.. టైగర్వి. ‘ఫీల్ ద సైలెన్స్ బిఫోర్ ద హంట్’ అనే క్యాప్షన్తో సినిమాపై మంచి ఫీల్ని కూడా కలిగించే ప్రయత్నం చేశారు. ఇంతవరకు మాస్ సినిమాలతో, ఫిక్షనల్ క్యారెక్టర్స్తో అదరగొట్టిన రవితేజ.. ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్లో ఎలా ఉంటాడో చూడాల్సిందే.
This post was last modified on November 4, 2021 4:31 am
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…