సీనియర్ హీరో రాజశేఖర్ చాలా వరకు సీరియస్ సినిమాలు చేస్తుంటాడు. ఇక దర్శకుడు శ్రీను వైట్ల పేరెత్తితే కామెడీ సినిమాలే గుర్తుకొస్తాయి. మరి ఈ కలయికలో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? అస్సలు ఊహకందని కాంబినేషన్ కదా ఇది. ఈ కాంబినేషన్లో 20 ఏళ్ల కిందటే ఓ సినిమా రావాల్సిందట. ఈ సినిమాకు ‘అపరిచితుడు’ అనే టైటిల్ కూడా ఖరారైందట. కానీ ఏవో కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీను వైట్లను ఆలీ నిర్వహించే టీవీ షోలో వెల్లడించడం విశేషం.
ఈ మధ్య ‘దూకుడు’ దశమ వార్షికోత్సవం అయినప్పటి నుంచి వైట్ల మీడియాకు తరచుగా ఇంటర్వ్యూలిస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలీ షోలో పాల్గొన్నట్లున్నారు.
ఈ సందర్భంగా తన అరంగేట్రం రాజశేఖర్ సినిమాతో జరగాల్సిందని వెల్లడించాడు వైట్ల. ఐతే ఆ సినిమా మొదలైనట్లే మొదలై ఆగిపోయిందని.. తర్వాత రవితేజతో ‘నీకోసం’ చేశానని వైట్ల తెలిపాడు. ఈ సినిమా చూసిన రామోజీరావు ఇంప్రెస్ అయి తన సంస్థలో సినిమా అవకాశం ఇస్తానన్నారని.. ఐతే ఓ మంచి రోజు చూసి సినిమా మొదలుపెడదాం అని తాను అంటే.. ‘‘ఛెడ్డ రోజే మొదలుపెట్టండి. సినిమా ఎందుకు ఆడదో చూద్దాం’’ అని ఆయన అన్నట్లుగా వైట్ల వెల్లడించాడు.
వైట్ల-రామోజీరావు కలయికలో వచ్చిన ‘ఆనందం’ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇక ‘ఆగడు’ సినిమా ఎందుకు ఫ్లాపైందో కూడా వైట్ల ఈ ఇంటర్వ్యూలో వివరించాడు. మహేష్ అభిమానులు మాస్ సినిమా కావాలని ఒకటే పోరు పెట్టేశారని… వాళ్ల ఆకాంక్షలకు తగ్గట్లు సినిమా తీశానని.. ఐతే ఇతరుల గురించి ఆలోచించకుండా మనల్ని మనం సేవ్ చేసుకోవాలనే పాఠం ఈ సినిమాతో నేర్చుకున్నానని వైట్ల తెలిపాడు. ఇవన్నీ ఈ ఎపిసోడ్ ప్రోమో ముచ్చట్లే. మరిన్ని ఆసక్తికర విషయాలతో కూడిన ఈ ఎపిసోడ్ ఈ వారం ప్రసారం కానుంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…