సీనియర్ హీరో రాజశేఖర్ చాలా వరకు సీరియస్ సినిమాలు చేస్తుంటాడు. ఇక దర్శకుడు శ్రీను వైట్ల పేరెత్తితే కామెడీ సినిమాలే గుర్తుకొస్తాయి. మరి ఈ కలయికలో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? అస్సలు ఊహకందని కాంబినేషన్ కదా ఇది. ఈ కాంబినేషన్లో 20 ఏళ్ల కిందటే ఓ సినిమా రావాల్సిందట. ఈ సినిమాకు ‘అపరిచితుడు’ అనే టైటిల్ కూడా ఖరారైందట. కానీ ఏవో కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీను వైట్లను ఆలీ నిర్వహించే టీవీ షోలో వెల్లడించడం విశేషం.
ఈ మధ్య ‘దూకుడు’ దశమ వార్షికోత్సవం అయినప్పటి నుంచి వైట్ల మీడియాకు తరచుగా ఇంటర్వ్యూలిస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలీ షోలో పాల్గొన్నట్లున్నారు.
ఈ సందర్భంగా తన అరంగేట్రం రాజశేఖర్ సినిమాతో జరగాల్సిందని వెల్లడించాడు వైట్ల. ఐతే ఆ సినిమా మొదలైనట్లే మొదలై ఆగిపోయిందని.. తర్వాత రవితేజతో ‘నీకోసం’ చేశానని వైట్ల తెలిపాడు. ఈ సినిమా చూసిన రామోజీరావు ఇంప్రెస్ అయి తన సంస్థలో సినిమా అవకాశం ఇస్తానన్నారని.. ఐతే ఓ మంచి రోజు చూసి సినిమా మొదలుపెడదాం అని తాను అంటే.. ‘‘ఛెడ్డ రోజే మొదలుపెట్టండి. సినిమా ఎందుకు ఆడదో చూద్దాం’’ అని ఆయన అన్నట్లుగా వైట్ల వెల్లడించాడు.
వైట్ల-రామోజీరావు కలయికలో వచ్చిన ‘ఆనందం’ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇక ‘ఆగడు’ సినిమా ఎందుకు ఫ్లాపైందో కూడా వైట్ల ఈ ఇంటర్వ్యూలో వివరించాడు. మహేష్ అభిమానులు మాస్ సినిమా కావాలని ఒకటే పోరు పెట్టేశారని… వాళ్ల ఆకాంక్షలకు తగ్గట్లు సినిమా తీశానని.. ఐతే ఇతరుల గురించి ఆలోచించకుండా మనల్ని మనం సేవ్ చేసుకోవాలనే పాఠం ఈ సినిమాతో నేర్చుకున్నానని వైట్ల తెలిపాడు. ఇవన్నీ ఈ ఎపిసోడ్ ప్రోమో ముచ్చట్లే. మరిన్ని ఆసక్తికర విషయాలతో కూడిన ఈ ఎపిసోడ్ ఈ వారం ప్రసారం కానుంది.
This post was last modified on November 2, 2021 3:46 pm
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…