బ్రింగింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా.. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి లేటెస్టుగా రిలీజ్ చేసిన టీజర్ గ్లింప్స్లో కనిపించిన మాట ఇది. దీనికి అర్థమేంటా అని ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ఇండియన్ సినిమాకు పూర్వ వైభవం తీసుకురాబోతున్నట్లుగా జక్కన్న సంకేతాలు ఇచ్చినట్లున్నాడు ఈ మాట ద్వారా.
ఐతే పూర్వ వైభవం అంటే ఎప్పటిది.. ఎవరు తీసుకొచ్చింది.. మధ్యలో ఆ వైభవానికి ఏమైంది? ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతోనే ఆ వైభవం వచ్చేస్తుందా.. అన్నది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయింది. ఇది రాజమౌళి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో వాడిన మాటలా తోస్తోంది కొందరికి. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లకు ఇది అంతగా రుచించే అవకాశం లేదు. ఇప్పటికే ‘బాహుబలి’ దెబ్బకు బాలీవుడ్ బెంబేలెత్తిపోయింది. ఆ సినిమా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు అక్కడి ఫిలిం మేకర్లు.
ఇండియన్ సినిమాలో తమదే ఆధిపత్యం అని.. ప్రపంచ స్థాయిలో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అన్న అభిప్రాయంతో ఉన్న వాళ్లను ఒక ఆత్మన్యూనతా భావంలోకి నెట్టిన చిత్రమిది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ప్రోమోలు చూసి మరింతగా వాళ్లు కంగారెత్తిపోతున్నారు. జక్కన్న మరోసారి ‘బాహుబలి’ తరహాలో ఉత్తర భారత బాక్సాఫీస్పై దండయాత్ర చేయడం.. అక్కడి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించి థియేటర్లను షేక్ చేయడం.. అలాగే బాలీవుడ్ను బెంబేలెత్తించడం పక్కాగా కనిపిస్తోంది.
అందులోనూ ఇండియన్ సినిమాకు పూర్వ వైభవం తీసుకొచ్చే సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ను పేర్కొనడం బాలీవుడ్ వాళ్లను మరింతగా బెంబేలెత్తించేదే. ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ మీద దండయాత్ర చేసి అక్కడి వాళ్లను మరింత ఆత్మన్యూనతా భావంలోకి నెట్టేసేలా ఉన్నాడు జక్కన్న. ‘బాహుబలి’ ఏదో ఫ్లూక్ హిట్ అనుకునే వాళ్లు కూడా ఇక మన రాజమౌళి సత్తా ఏంటో పూర్తిగా తెలుసుకుని ఇండియన్ సినిమా నంబర్ వన్ డైరెక్టర్గా ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారేమో.
This post was last modified on November 1, 2021 3:14 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…