2022 సంక్రాంతి సినిమాలపై ఇంకా ఒక క్లారిటీ లేదు. ముందు అనుకున్న ప్రకారం అయితే జనవరి 12, 13, 14 తేదీల్లో వరుసగా భీమ్లానాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ రావాల్సింది. కానీ గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి డోలాయామాన పరిస్థితి కనిపిస్తోంది. ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సిన సినిమా కావడంతో దాన్ని అనుకున్నట్లే జనవరి 14న రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫిక్సయ్యారు.
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ నుంచి వారం రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి, ప్రభాస్కు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఫాలోయింగ్ మీద నమ్మకంతో మేకర్స్ సంక్రాంతి పందేనికి సిద్ధమయ్యారు. కానీ భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాల విషయంలో మాత్రం వాటి నిర్మాతలు కొంచెం తటపటాయిస్తున్నారు. అలాగని వెంటనే వాయిదా అంటే ‘ఆర్ఆర్ఆర్’కు భయపడినట్లవుతుందని మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారు. అదే సమయంలో ముందు రిలీజ్ డేట్ ప్రకటించింది తామే కాబట్టి మధ్యలో ‘ఆర్ఆర్ఆర్’ రావడం అన్యాయమంటూ ఇండస్ట్రీ పెద్దల దగ్గర పంచాయితీలు పెట్టారు. ఆ సినిమాను వాయిదా వేయించేందుకు కూడా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది.
‘ఆర్ఆర్ఆర్’ టీం అన్నీ చూసుకునే డేట్ ఫిక్స్ చేసింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డ సినిమాను ఇంకోసారి పోస్ట్ పోన్ చేయడం కష్టమని తేల్చేసింది. ఈ మేరకు ప్రమోషన్ల హడావుడి కూడా మొదలైపోయింది. కాబట్టి భీమ్లానాయక్, సర్కారు వారి పాట చిత్రాలు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. కానీ వాటి నిర్మాతల నుంచి ప్రకటన మాత్రం రావట్లేదు.
ఐతే ఇలాంటి సమయంలోనే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమా మీద ఉన్న అంచనాల్ని ఇంకొన్ని రెట్లు పెంచేసిందీ చిన్న టీజర్. కేవలం 40 సెకన్ల వీడియోతోనే ప్రకంపనలు రేపాడు రాజమౌళి. మళ్లీ ‘బాహుబలి’ లాగే స్క్రీన్లను తగలెట్టేయబోతున్నాడని అర్థమైపోయింది. ఇంకా సంక్రాంతి మీద ఆశలేమైనా పెట్టుకుని ఉంటే మీ ఇష్టం అని.. రేసులో ఉన్న మిగతా చిత్రాలకు ఒ హెచ్చరిక జారీ చేసినట్లుగా ఉంది ఈ గ్లింప్స్. ఇక అహానికి పోకుండా భీమ్లానాయక్, సర్కారు వారి పాట చిత్రాలను వాయిదా వేసేస్తున్నట్లు వాటి నిర్మాతలు ప్రకటించడం ఉత్తమమేమో.
This post was last modified on November 1, 2021 2:41 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…