Movie News

ప్రశాంత్ నీల్.. రేడియేషన్ సూట్ రెడీనా?

రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో ఒక్కసారిగా తన రేంజ్ పెంచుకోబోతున్న ఎన్టీఆర్.. దాని తర్వాత ఎవరితో, ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా సెట్ చేసుకున్నాడు తారక్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

ఇది పక్కా సమాచారమే అయినా.. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి పరోక్ష సంకేతాలు అందుతూనే ఉన్నాయి. గత నెలలో తారక్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ఓ స్పెషల్ ట్వీట్ వేశాడు. ఎన్టీఆర్‌ ఎనర్జీ గురించి చెబుతూ.. అతను పక్కనుంటే న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చున్నట్లు ఉంటుందని.. ఈసారి రేడియేషన్ సూట్ వేసుకుని వస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

దీన్ని బట్టే ప్రశాంత్.. ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడని స్పష్టమైంది. ఇప్పుడు ఈ ట్వీట్‌కు కొనసాగింపుగా ఒక ట్వీట్ వేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. గురువారం ప్రశాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అతడికి శుభాకాంక్షలు చెబుతూ.. అతను రేడియేషన్ సూట్ వేసుకుని వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు చమత్కరించింది. అంటే తారక్-ప్రశాంత్ సినిమా కోసం తాము ఎదురు చూస్తున్నట్లు ఆ సంస్థ పరోక్షంగా చెప్పిందన్నమాట.

మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ప్రశాంత్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పడానికి కారణం తారక్‌తో అతను సినిమా చేయబోతుండటమే అన్నది స్పష్టం. మరి ఈ ప్రాజెక్టు గురించి ఇలాంటి దోబూచులాటలు కాకుండా.. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Satya

Recent Posts

భాగ్యశ్రీ… ముచ్చటగా మూడో భాషలోకి

ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో…

26 minutes ago

నిర్మాతకు 15 కండిషన్లు పెట్టిన కొత్త హీరోయిన్

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…

59 minutes ago

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

2 hours ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

3 hours ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

3 hours ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

3 hours ago