రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో ఒక్కసారిగా తన రేంజ్ పెంచుకోబోతున్న ఎన్టీఆర్.. దాని తర్వాత ఎవరితో, ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సినిమా సెట్ చేసుకున్నాడు తారక్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.
ఇది పక్కా సమాచారమే అయినా.. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి పరోక్ష సంకేతాలు అందుతూనే ఉన్నాయి. గత నెలలో తారక్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ఓ స్పెషల్ ట్వీట్ వేశాడు. ఎన్టీఆర్ ఎనర్జీ గురించి చెబుతూ.. అతను పక్కనుంటే న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చున్నట్లు ఉంటుందని.. ఈసారి రేడియేషన్ సూట్ వేసుకుని వస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
దీన్ని బట్టే ప్రశాంత్.. ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నాడని స్పష్టమైంది. ఇప్పుడు ఈ ట్వీట్కు కొనసాగింపుగా ఒక ట్వీట్ వేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. గురువారం ప్రశాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అతడికి శుభాకాంక్షలు చెబుతూ.. అతను రేడియేషన్ సూట్ వేసుకుని వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు చమత్కరించింది. అంటే తారక్-ప్రశాంత్ సినిమా కోసం తాము ఎదురు చూస్తున్నట్లు ఆ సంస్థ పరోక్షంగా చెప్పిందన్నమాట.
మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ప్రశాంత్కు ప్రత్యేకంగా పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పడానికి కారణం తారక్తో అతను సినిమా చేయబోతుండటమే అన్నది స్పష్టం. మరి ఈ ప్రాజెక్టు గురించి ఇలాంటి దోబూచులాటలు కాకుండా.. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on June 4, 2020 3:20 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…