రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో ఒక్కసారిగా తన రేంజ్ పెంచుకోబోతున్న ఎన్టీఆర్.. దాని తర్వాత ఎవరితో, ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సినిమా సెట్ చేసుకున్నాడు తారక్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.
ఇది పక్కా సమాచారమే అయినా.. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి పరోక్ష సంకేతాలు అందుతూనే ఉన్నాయి. గత నెలలో తారక్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ఓ స్పెషల్ ట్వీట్ వేశాడు. ఎన్టీఆర్ ఎనర్జీ గురించి చెబుతూ.. అతను పక్కనుంటే న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చున్నట్లు ఉంటుందని.. ఈసారి రేడియేషన్ సూట్ వేసుకుని వస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
దీన్ని బట్టే ప్రశాంత్.. ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నాడని స్పష్టమైంది. ఇప్పుడు ఈ ట్వీట్కు కొనసాగింపుగా ఒక ట్వీట్ వేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. గురువారం ప్రశాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అతడికి శుభాకాంక్షలు చెబుతూ.. అతను రేడియేషన్ సూట్ వేసుకుని వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు చమత్కరించింది. అంటే తారక్-ప్రశాంత్ సినిమా కోసం తాము ఎదురు చూస్తున్నట్లు ఆ సంస్థ పరోక్షంగా చెప్పిందన్నమాట.
మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ప్రశాంత్కు ప్రత్యేకంగా పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పడానికి కారణం తారక్తో అతను సినిమా చేయబోతుండటమే అన్నది స్పష్టం. మరి ఈ ప్రాజెక్టు గురించి ఇలాంటి దోబూచులాటలు కాకుండా.. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on June 4, 2020 3:20 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…