రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో ఒక్కసారిగా తన రేంజ్ పెంచుకోబోతున్న ఎన్టీఆర్.. దాని తర్వాత ఎవరితో, ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సినిమా సెట్ చేసుకున్నాడు తారక్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.
ఇది పక్కా సమాచారమే అయినా.. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి పరోక్ష సంకేతాలు అందుతూనే ఉన్నాయి. గత నెలలో తారక్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ఓ స్పెషల్ ట్వీట్ వేశాడు. ఎన్టీఆర్ ఎనర్జీ గురించి చెబుతూ.. అతను పక్కనుంటే న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చున్నట్లు ఉంటుందని.. ఈసారి రేడియేషన్ సూట్ వేసుకుని వస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
దీన్ని బట్టే ప్రశాంత్.. ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నాడని స్పష్టమైంది. ఇప్పుడు ఈ ట్వీట్కు కొనసాగింపుగా ఒక ట్వీట్ వేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. గురువారం ప్రశాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అతడికి శుభాకాంక్షలు చెబుతూ.. అతను రేడియేషన్ సూట్ వేసుకుని వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు చమత్కరించింది. అంటే తారక్-ప్రశాంత్ సినిమా కోసం తాము ఎదురు చూస్తున్నట్లు ఆ సంస్థ పరోక్షంగా చెప్పిందన్నమాట.
మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ప్రశాంత్కు ప్రత్యేకంగా పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పడానికి కారణం తారక్తో అతను సినిమా చేయబోతుండటమే అన్నది స్పష్టం. మరి ఈ ప్రాజెక్టు గురించి ఇలాంటి దోబూచులాటలు కాకుండా.. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on June 4, 2020 3:20 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…