మరక్కార్.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ చిత్రం. లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ రూపొందించిన ఈ చిత్రాన్ని మేకింగ్ దశ నుంచే మలయాళ ‘బాహుబలి’గా అభివర్ణిస్తున్నారు. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ స్టయిల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రియదర్శన్. దీని ప్రోమోలు చూస్తే సినిమా సంచలనం రేపడం ఖాయంగా కనిపించింది.
ఐతే ఏడాదిన్నర కిందటే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది ఎన్ని ఓటీటీ ఆఫర్లు వచ్చినా చిత్ర బృందం టెంప్ట్ కాలేదు. ఇలాంటి భారీ చిత్రం వెండి తెరల్లో చూస్తేనే ప్రేక్షకులకు అందాల్సిన అనుభూతి అందుతుందన్న ఉద్దేశంతో సాధారణ పరిస్థితుల కోసం ఎదురు చూశారు.
ఐతే ఈ ఏడాది మార్చిలో థియేట్రికల్ రిలీజ్ కోసం సన్నాహాలు పూర్తి చేశాక కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. ఇక అప్పట్నుంచి మళ్లీ థియేటర్లు పూర్తి స్థాయిలో నడిచే వరకు ఎదురు చూసి చూసి.. ఎట్టకేలకు పరిస్థితులు బాగుపడుతున్నాయనుకుంటున్న సమయంలో ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేయడం లాల్ అభిమానులకు పెద్ద షాక్.
మలయాళంలో మళ్లీ థియేటర్లు పున:ప్రారంభమై.. కొన్ని రోజుల్లోనే 100 శాతం ఆక్యుపెన్సీ వస్తుందనుకుంటున్న సమయంలో ‘మరక్కార్’ను అమేజాన్ ప్రైమ్కు ఇచ్చేయడం అందరినీ నివ్వెర పరుస్తోంది. మంచి లాభానికే సినిమాను ప్రైమ్కు అమ్మేశారట. దేశంలో మిగతా రాష్ట్రాలన్నింట్లో కరోనా ప్రభావం బాగా తగ్గిన టైంలో కేరళలో వైరస్ ప్రభావం చూపింది.
ఇప్పుడు అక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ.. మళ్లీ వైరస్ ముప్పు ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారన్న గ్యారెంటీ లేక, ఆశించిన రెవెన్యూ రాకపోవచ్చన్న భయంతో ఓటీటీ బాట పట్టినట్లున్నారు. కానీ ఇలాంటి సినిమాను బుల్లితెరల్లో చూడాల్సి రావడం మాత్రం లాల్ అభిమానులకే కాదు.. సాధారణ ప్రేక్షకులకు కూడా రుచించడం లేదు. త్వరలోనే ఈ భారీ చిత్రానికి రిలీజ్ డేట్ ఇవ్వనున్నారు.
This post was last modified on October 31, 2021 11:29 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…