పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు రాఘవేంద్రరావుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ లాంటి పౌరాణిక గాథలను ఎంతో గొప్పగా చిత్రీకరించి ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు మరో పౌరాణిక చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారు. ఆయన చివరిగా డైరెక్ట్ చేసిన సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’. 2017లో విడుదలైన ఈ సినిమా తరువాత రాఘవేంద్రరావు మెగాఫోన్ పట్టుకోలేదు.
అయితే ఇప్పుడు నటుడిగా మాత్రం సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాలో ఓ పాత్రలో కనిపించారు మన దర్శకేంద్రుడు.
ఇప్పుడు తణికెళ్లభరణి డైరెక్ట్ చేస్తోన్న ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు డైరెక్టర్ గా ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట రాఘవేంద్రరావు. ‘రామాయణం’ కథను సినిమాగా తీయాలనుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గాథను ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
భారీ హంగులతో.. స్టార్ నటీనటులతో ఈ కథను తెరకెక్కించబోతున్నారు. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు రామాయణం కథతో చాలా సినిమాలు వచ్చాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ కూడా రామాయణం కాన్సెప్ట్ తోనే తెరకెక్కిస్తున్నారు. అయితే రాఘవేంద్రరావు మాత్రం రామాయణాన్ని కొత్త పద్దతిలో ఆవిష్కరించబోతున్నారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి!
This post was last modified on October 30, 2021 3:08 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…