పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు రాఘవేంద్రరావుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ లాంటి పౌరాణిక గాథలను ఎంతో గొప్పగా చిత్రీకరించి ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు మరో పౌరాణిక చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారు. ఆయన చివరిగా డైరెక్ట్ చేసిన సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’. 2017లో విడుదలైన ఈ సినిమా తరువాత రాఘవేంద్రరావు మెగాఫోన్ పట్టుకోలేదు.
అయితే ఇప్పుడు నటుడిగా మాత్రం సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాలో ఓ పాత్రలో కనిపించారు మన దర్శకేంద్రుడు.
ఇప్పుడు తణికెళ్లభరణి డైరెక్ట్ చేస్తోన్న ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు డైరెక్టర్ గా ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట రాఘవేంద్రరావు. ‘రామాయణం’ కథను సినిమాగా తీయాలనుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గాథను ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
భారీ హంగులతో.. స్టార్ నటీనటులతో ఈ కథను తెరకెక్కించబోతున్నారు. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు రామాయణం కథతో చాలా సినిమాలు వచ్చాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ కూడా రామాయణం కాన్సెప్ట్ తోనే తెరకెక్కిస్తున్నారు. అయితే రాఘవేంద్రరావు మాత్రం రామాయణాన్ని కొత్త పద్దతిలో ఆవిష్కరించబోతున్నారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి!
This post was last modified on October 30, 2021 3:08 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…