అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి పట్ల ఓ శ్వేత జాతీయుడైన పోలీస్ అధికారి కిరాతకంగా వ్యవహరించడం, దీంతో అతను ప్రాణాలు వదలడం.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు సాగుతుండటం తెలిసిన సంగతే.
కరోనా భయాన్ని కూడా వదిలిపెట్టి లక్షలాది మంది నల్ల జాతీయులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అవి హింసాత్మకంగా మారాయి కూడా. ఆ తాకిడి వైట్ హౌస్ను తాకి అధ్యక్షుడు ట్రంప్ కుటుంబం బంకర్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వర్ణ వివక్షపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. దీనిపై రకరకాల హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వివక్షను ఖండిస్తున్నారు. మన మహేష్ బాబు సైతం నిన్న ట్రెండింగ్లో ఉన్న #noblacktuesday హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ వేశాడు.
ఐతే ఈ ట్వీట్ మీద నెటిజన్లు మండిపడుతున్నారు. మహేష్ బాబు మీద కౌంటర్లు వేస్తున్నారు. అతడి సినిమాల్లో రంగు ప్రాధాన్యాన్ని ఎలివేట్ చేసేలా ఉన్న సన్నివేశాల్ని బయటికి తీసి మహేష్ను ట్రోల్ చేస్తున్నారు. అతడు సినిమాలో త్రిషను ఉద్దేశించి పెద్ద కలర్ కూడా కాదు కదా అంటాడు మహేష్. దూకుడు మూవీలో నీ కలరేంటి నా కలరేంటి అని సమంతను కౌంటర్ చేస్తాడు. ఈ మధ్య వచ్చిన సరిలేరు నీకెవ్వరులో మియాం మియాం పిల్లి మిల్క్ బాయ్తో పెళ్లి అనే డైలాగ్ ఉంటుంది.
ఇంకా చాలా సినిమాల్లో మహేష్ రంగును పొగుడుతూ డైలాగులు, సీన్లు ఉంటాయి. రంగు గురించి ఇలా ఎలివేషన్లు ఇచ్చుకుని.. ఇప్పడు #noblacktuesday అని ట్వీట్ వేయడం హిపోక్రసీ అంటూ మహేష్ బాబును విమర్శిస్తున్నారు నెటిజన్లు. మహేష్ అని కాదు.. ఇంకా చాలామంది సెలబ్రెటీలు ఇలాగే ట్రోలింగ్కు గురవుతున్నారు. ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ చేసిన వాళ్లందరికీ ఈ సెగ తగులుతోంది.
This post was last modified on June 4, 2020 10:48 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…