అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి పట్ల ఓ శ్వేత జాతీయుడైన పోలీస్ అధికారి కిరాతకంగా వ్యవహరించడం, దీంతో అతను ప్రాణాలు వదలడం.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు సాగుతుండటం తెలిసిన సంగతే.
కరోనా భయాన్ని కూడా వదిలిపెట్టి లక్షలాది మంది నల్ల జాతీయులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అవి హింసాత్మకంగా మారాయి కూడా. ఆ తాకిడి వైట్ హౌస్ను తాకి అధ్యక్షుడు ట్రంప్ కుటుంబం బంకర్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వర్ణ వివక్షపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. దీనిపై రకరకాల హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వివక్షను ఖండిస్తున్నారు. మన మహేష్ బాబు సైతం నిన్న ట్రెండింగ్లో ఉన్న #noblacktuesday హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ వేశాడు.
ఐతే ఈ ట్వీట్ మీద నెటిజన్లు మండిపడుతున్నారు. మహేష్ బాబు మీద కౌంటర్లు వేస్తున్నారు. అతడి సినిమాల్లో రంగు ప్రాధాన్యాన్ని ఎలివేట్ చేసేలా ఉన్న సన్నివేశాల్ని బయటికి తీసి మహేష్ను ట్రోల్ చేస్తున్నారు. అతడు సినిమాలో త్రిషను ఉద్దేశించి పెద్ద కలర్ కూడా కాదు కదా అంటాడు మహేష్. దూకుడు మూవీలో నీ కలరేంటి నా కలరేంటి అని సమంతను కౌంటర్ చేస్తాడు. ఈ మధ్య వచ్చిన సరిలేరు నీకెవ్వరులో మియాం మియాం పిల్లి మిల్క్ బాయ్తో పెళ్లి అనే డైలాగ్ ఉంటుంది.
ఇంకా చాలా సినిమాల్లో మహేష్ రంగును పొగుడుతూ డైలాగులు, సీన్లు ఉంటాయి. రంగు గురించి ఇలా ఎలివేషన్లు ఇచ్చుకుని.. ఇప్పడు #noblacktuesday అని ట్వీట్ వేయడం హిపోక్రసీ అంటూ మహేష్ బాబును విమర్శిస్తున్నారు నెటిజన్లు. మహేష్ అని కాదు.. ఇంకా చాలామంది సెలబ్రెటీలు ఇలాగే ట్రోలింగ్కు గురవుతున్నారు. ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ చేసిన వాళ్లందరికీ ఈ సెగ తగులుతోంది.
This post was last modified on June 4, 2020 10:48 am
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…