టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ అనుకోని విధంగా రోడ్డు ప్రమాదానికి గురి కావడం.. దాదాపు నెల రోజులు ఆసుపత్రిలోనే ఉండటం తెలిసిందే. వినాయక చవితి పర్వదినాన జరిగిన ఆ ప్రమాదం టాలీవుడ్కు పెద్ద షాకే. తేజుకు ప్రాణాపాయం తప్పింది కానీ.. అతడికి తగిలిన గాయాలు చిన్నవేమీ కాదనడానికి రుజువు.. అతను నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండటం.
తన సినిమా ‘రిపబ్లిక్’ ప్రమోషన్లలో అతను పాల్గొనడానికే వీల్లేకపోయింది. రిలీజ్ తర్వాత కూడా ఆడియో, వీడియో బైట్లు ఇవ్వలేకపోయాడు. తేజును కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలుస్తున్నా కూడా అతడి ఫొటోలేవీ బయటికి రావడం లేదు.
గాయాలతో, లేదా మరీ వీక్గా కనిపిస్తున్న దశలో ఫొటోలు బయటికి వస్తే అవి జనాలకు అలా గుర్తుండిపోతాయని.. అందుకే పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అయ్యే వరకు తేజు ఫొటోలు, వీడియోలేవీ బయటికి రాకుండా చూస్తున్నారని తెలుస్తోంది.
ఐతే తేజును కలిసిన వాళ్లు చెబుతున్న దాని ప్రకారం అతను మునుపటితో పోలిస్తే సన్నగా కనిపిస్తున్నాడట. యాక్సిడెంట్ వల్ల తేజుకు జరిగిన మంచి ఇదే అని అంటున్నారు. ‘రిపబ్లిక్’ సినిమాలో.. అంతకుముందు సోలో బ్రతుకే సో బెటర్, ప్రతి రోజూ పండగే చిత్రాల్లో తేజును చూసిన చాలామంది అతడి ఫిజిక్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
అతను లావుగా కనిపిస్తున్నాడని.. సన్నబడాలని సూచించారు. కానీ తేజు తగ్గలేకపోయాడు. ఐతే ప్రమాదం తర్వాత కొన్ని రోజులు తేజు స్పృహలో లేకపోవడం, ఘన పదార్థాలేవీ తీసుకోకపోవడంతో అతను బలహీన పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గణనీయంగానే బరువు తగ్గినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే తేజు కెరీర్ ఆరంభంలో మాదిరి సన్నగా తయారయ్యాడని.. కాకపోతే వీక్గా కనిపిస్తున్న నేపథ్యంలో కొంచెం బలవర్ధకమైన ఆహారం తీసుకుని, వర్కవుట్లు చేస్తే దృఢంగా తయారై మంచి లుక్లోకి రాగలడని అంటున్నారు.
This post was last modified on October 27, 2021 3:36 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…