ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ‘మాస్టర్ చెఫ్’ షో ఇప్పుడు సౌత్ ఇండియాకు వచ్చేసింది. దాదాపు అన్ని భాషల్లో ఈ షోను మొదలుపెట్టారు. తెలుగులో ఈ షోకి హోస్ట్ గా తమన్నాను ఎంపిక చేసుకున్నారు. ఆగస్టు నెల నుంచి ఈ షోని ప్రసారం చేస్తున్నారు.
అయితే రీసెంట్ గానే ఈ షో నుంచి తమన్నాను తొలగించి మరో పాపులర్ యాంకర్ అనసూయను తీసుకున్నారు. తమన్నా బిజీగా ఉండడంతో ఆమె ఈ షో నుంచి తప్పుకుందేమోనని అందరూ అనుకున్నారు.
కానీ ఈ షో నుంచి తనను కావాలనే తప్పించారంటూ తమన్నా షో నిర్వాహకులకు నోటీసులు పంపించింది. తనను కనీసం సంప్రదించకుండా.. కమ్యూనికేషన్ కట్ చేసి అన్ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేశారంటూ తమన్నా తన పిటిషన్ లో పేర్కొంది. దీనికి స్పందించిన నిర్వాహకులు కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమన్నాను హోస్ట్ గా ఎన్నుకున్నప్పుడు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ కి అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు.
జూన్ 24 నుంచి సెప్టెంబర్ నెల చివరి వరకు మధ్యలో మొత్తం 18 రోజుల పాటు షోకి హోస్ట్ గా వ్యవహరించడానికి ఆమె సైన్ చేసినట్లు చెప్పారు. కానీ ఆమెకున్న కమిట్మెంట్స్ కారణంగా 18 రోజుల్లో 16 రోజులు మాత్రమే షూటింగ్ కి హాజరయ్యారని.. రెండు రోజులు షూటింగ్ కి రాలేదని అన్నారు. అప్పటికే రూ.1.56 కోట్లు పేమెంట్ ఇచ్చేశామని తెలిపారు.
ఆమె రెండు రోజులపాటు షూటింగ్ కి హాజరు కాకపోవడంతో దాదాపు మూడు వందల మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తోన్న ప్రొడక్షన్ హౌస్ కి రూ.5 కోట్లకు పైగా నష్టం వచ్చిందని తెలిపారు. అగ్రిమెంట్ చేసుకున్నప్రకారం ఆమె మొత్తం షూటింగ్ పూర్తి చేసి ఉంటే మిగిలిన రూ.50 లక్షల పేమెంట్ కూడా ఇచ్చేవాళ్లమని చెప్పుకొచ్చారు. షూటింగ్ పూర్తి చేయకుండా.. రెండో సీజన్ కి అడ్వాన్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారని.. అసలు సెకండ్ సీజన్ కి ఆమెని హోస్ట్ గా అనుకోలేదని చెప్పుకొచ్చారు.
This post was last modified on October 27, 2021 3:39 pm
పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం పాటు పాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం…
ఎయిర్పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…