సాధారణంగా పెద్ద హీరోలు కొత్త హీరోయిన్లతో సినిమాలు చేయడం అరుదు. తమ రేంజికి తగ్గట్లు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లనే ప్రిఫర్ చేస్తుంటారు. కొత్తమ్మాయిలను పెట్టుకుంటే హీరోల ఇమేజ్ ముందు వాళ్ల తూగరేమో అనే భయం ఉంటుంది. ఈ కారణంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన చాలా కాలం నుంచి కొత్త అమ్మాయిలను నటింపజేయట్లేదు. గత దశాబ్ద కాలంలో ఒక్క ‘పంజా’ మూవీలో మాత్రమే సారాజేన్ డయాస్ అనే కొత్తమ్మాయితో పవన్కు జోడీ కట్టించారు. నిజానికి ఆ అమ్మాయి కూడా బాలీవుడ్లో అప్పటికే కొంచెం పాపులారిటీ ఉన్న అమ్మాయే.
ఆ తర్వాత మాత్రం పవన్ ఏ అప్కమింగ్, డెబ్యూ హీరోయిన్లతో నటించలేదు. ఐతే ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత పవన్కు జోడీగా ఒక కొత్తమ్మాయి నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సాక్షి వైద్య అనే మోడల్ పవన్కు జోడీగా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేయబోయే కొత్త సినిమాలో సాక్షి వైద్యను హీరోయిన్గా పేర్కొంటున్నారు. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. నిజానికి ఈ అమ్మాయిని సురేందర్ రెడ్డి ప్రస్తుతం తీస్తున్న ‘ఏజెంట్’ మూవీకి కథానాయికగా ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే దీని గురించి ఇప్పటిదాకా అధికారిక సమాచారం అయితే లేదు. ఐతే ఇప్పుడేమో పవన్కు జోడీగా సాక్షి నటించబోతోందని, ఆమెతో నిర్మాత రామ్ తాళ్లూరి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని అంటున్నారు.
ఐతే ‘ఏజెంట్’ కోసం సాక్షి ఇప్పటికే పని చేస్తోందా.. ఆమె వర్క్ చూసి ఇంప్రెస్ అయి సురేందర్ పవన్ సినిమాకు కూడా తననే కథానాయికగా ఎంచుకున్నాడా అన్న దానిపై క్లారిటీ లేదు. ఐతే అఖిల్ లాంటి యంగ్ హీరో పక్కన కథానాయికగా చేసిన అమ్మాయి పవన్ పక్కన ఎలా ఉంటుందో.. ఇంత చిన్నమ్మాయితో రొమాన్స్ చేయడానికి పవన్ ఒప్పుకుంటాడో లేదో అన్న డౌటానుమానాలు కలుగుతున్నాయి నెటిజన్లకు. దీనిపై కొన్ని రోజుల్లో క్లారిటీ రావచ్చు.
This post was last modified on October 26, 2021 2:28 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…