సాధారణంగా పెద్ద హీరోలు కొత్త హీరోయిన్లతో సినిమాలు చేయడం అరుదు. తమ రేంజికి తగ్గట్లు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లనే ప్రిఫర్ చేస్తుంటారు. కొత్తమ్మాయిలను పెట్టుకుంటే హీరోల ఇమేజ్ ముందు వాళ్ల తూగరేమో అనే భయం ఉంటుంది. ఈ కారణంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన చాలా కాలం నుంచి కొత్త అమ్మాయిలను నటింపజేయట్లేదు. గత దశాబ్ద కాలంలో ఒక్క ‘పంజా’ మూవీలో మాత్రమే సారాజేన్ డయాస్ అనే కొత్తమ్మాయితో పవన్కు జోడీ కట్టించారు. నిజానికి ఆ అమ్మాయి కూడా బాలీవుడ్లో అప్పటికే కొంచెం పాపులారిటీ ఉన్న అమ్మాయే.
ఆ తర్వాత మాత్రం పవన్ ఏ అప్కమింగ్, డెబ్యూ హీరోయిన్లతో నటించలేదు. ఐతే ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత పవన్కు జోడీగా ఒక కొత్తమ్మాయి నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సాక్షి వైద్య అనే మోడల్ పవన్కు జోడీగా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేయబోయే కొత్త సినిమాలో సాక్షి వైద్యను హీరోయిన్గా పేర్కొంటున్నారు. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. నిజానికి ఈ అమ్మాయిని సురేందర్ రెడ్డి ప్రస్తుతం తీస్తున్న ‘ఏజెంట్’ మూవీకి కథానాయికగా ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే దీని గురించి ఇప్పటిదాకా అధికారిక సమాచారం అయితే లేదు. ఐతే ఇప్పుడేమో పవన్కు జోడీగా సాక్షి నటించబోతోందని, ఆమెతో నిర్మాత రామ్ తాళ్లూరి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని అంటున్నారు.
ఐతే ‘ఏజెంట్’ కోసం సాక్షి ఇప్పటికే పని చేస్తోందా.. ఆమె వర్క్ చూసి ఇంప్రెస్ అయి సురేందర్ పవన్ సినిమాకు కూడా తననే కథానాయికగా ఎంచుకున్నాడా అన్న దానిపై క్లారిటీ లేదు. ఐతే అఖిల్ లాంటి యంగ్ హీరో పక్కన కథానాయికగా చేసిన అమ్మాయి పవన్ పక్కన ఎలా ఉంటుందో.. ఇంత చిన్నమ్మాయితో రొమాన్స్ చేయడానికి పవన్ ఒప్పుకుంటాడో లేదో అన్న డౌటానుమానాలు కలుగుతున్నాయి నెటిజన్లకు. దీనిపై కొన్ని రోజుల్లో క్లారిటీ రావచ్చు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…