టాలీవుడ్ అందమైన భామ ఒకరు కఠినమైన సవాలును పూర్తి చేశారు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో పర్వతాన్ని టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ అధిరోహించారు. హీరోయిన్లు అంటే ఏసీ కారవాన్లలో విశ్రాంతి తీసుకునే సున్నిత వ్యక్తులు అనుకునే వారు ఇప్పటికే చాలామందే ఉన్నారు. నివేదా థామస్ తాజా ఫీట్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్.
ఎంతో ట్రెక్కింగ్ అనుభవం ఉన్నవారు మాత్రమే సాధించే ఫీట్ ను రీల్ లో గ్లామర్ సొగసులతో మనసుల్ని దోచుకునే హీరోయిన్.. సాధించడం అసాధారణ విషయమే కదా. అది కూడా ఆఫ్రికా ఖండంలో కఠిన వాతావరణ పరిస్థితులున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించటం అంత తేలికైన విషయం కాదు.
తన కెరీర్ లో మొదట్నించి రోటీన్ పాత్రలకు కాస్తంత భిన్నంగా.. తన మార్కు కనిపించేలా సినిమాలు చేసే నివేదా చివరి సినిమా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్. అందులో ముగ్గురు అమ్మాయిల్లో పల్లవి పాత్రను పోషించారు. ప్రస్తుతం మీట్ క్యూట్ లో నటిస్తున్న ఆమె.. తాజాగా ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి.. శిఖరాగ్రానికి చేరుకున్న వేళ.. తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
చిన్నతనం నుంచి నివేదాకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం. ఈ మక్కువతో ఆర్నెల్లపాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఆమె.. సముద్ర మట్టానికి 19,340 అడుగుల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. అత్యంత కష్టమైన.. క్లిష్టమైన పర్యతారోహణగా దీన్ని చెబుతారు. అలాంటిది అత్యంత సాహసోపేతంగా ఆమె సాధించిన తీరు చూస్తే.. మిగిలిన గ్లామర్ భామలకు నివేదా భిన్నమని చెప్పాలి.
This post was last modified on October 24, 2021 12:28 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…