సినిమా టికెట్ రేట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్లు తగ్గించడంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు బాగా ఇబ్బంది పడ్డారు. కానీ రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం నాలుగు షోలకు అనుమతిచ్చింది. దీంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్లి సందడి’ వంటి సినిమాలకు మంచి లాభాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు టికెట్ రేట్లు పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రీసెంట్ గా ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఈ టికెట్ రేట్ల విషయంలో ఏమైనా సాయం చేయగలరా..? అని ఇండస్ట్రీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్.. విష్ణుకి బావ అవుతారు.
‘మా’ ఎన్నికల సమయంలో కూడా జగన్ మా బావ అంటూ విష్ణు ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. అయితే ఇప్పుడు విష్ణు కోరినా కూడా టికెట్ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకునేలా లేరు. ఆ డెసిషన్ సంక్రాంతికి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
సంక్రాంతి బరిలో ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కాబట్టి టికెట్ రేట్ల పెంపు జనవరిలో ఉండొచ్చని చెబుతున్నారు. 150 రూపాయలకు మించి రేట్లయితే పెరగవు కానీ కొన్ని సింగిల్ థియేటర్స్ లో 20, 30 రూపాయలకు టికెట్లను మాత్రం 50 నుంచి 55 రూపాయలను పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకారం తెలిపిందట. ప్రభుత్వం ఎలాంటి నియమాలు విధించినా.. భారీ సినిమాలు విడుదలైనప్పుడు మాత్రం ఎక్కువ రేట్లకు టికెట్లను అమ్మడం చూస్తూనే ఉన్నాం.
This post was last modified on October 23, 2021 11:37 am
వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా…
తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీ.జోసెఫ్ విజయ్ అను నాను..…
ఇప్పటి హీరోల్లో వచ్చామా నటించామా వెళ్లిపోయామా అనుకునే వాళ్లు తక్కువమంది. కథా చర్చల్లో భాగమవుతున్నారు. స్క్రిప్టులు రాస్తున్నారు. దర్శకత్వం కూడా…
తమిళేనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్న స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అదినేత జోసెఫ్ విజయ్ కి…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒకప్పుడు ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేశాడో తెలిసిందే. ముఖ్యంగా ‘లగాన్’ దగ్గర్నుంచి…
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…