సినిమా టికెట్ రేట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్లు తగ్గించడంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు బాగా ఇబ్బంది పడ్డారు. కానీ రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం నాలుగు షోలకు అనుమతిచ్చింది. దీంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్లి సందడి’ వంటి సినిమాలకు మంచి లాభాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు టికెట్ రేట్లు పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రీసెంట్ గా ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఈ టికెట్ రేట్ల విషయంలో ఏమైనా సాయం చేయగలరా..? అని ఇండస్ట్రీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్.. విష్ణుకి బావ అవుతారు.
‘మా’ ఎన్నికల సమయంలో కూడా జగన్ మా బావ అంటూ విష్ణు ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. అయితే ఇప్పుడు విష్ణు కోరినా కూడా టికెట్ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకునేలా లేరు. ఆ డెసిషన్ సంక్రాంతికి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
సంక్రాంతి బరిలో ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కాబట్టి టికెట్ రేట్ల పెంపు జనవరిలో ఉండొచ్చని చెబుతున్నారు. 150 రూపాయలకు మించి రేట్లయితే పెరగవు కానీ కొన్ని సింగిల్ థియేటర్స్ లో 20, 30 రూపాయలకు టికెట్లను మాత్రం 50 నుంచి 55 రూపాయలను పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకారం తెలిపిందట. ప్రభుత్వం ఎలాంటి నియమాలు విధించినా.. భారీ సినిమాలు విడుదలైనప్పుడు మాత్రం ఎక్కువ రేట్లకు టికెట్లను అమ్మడం చూస్తూనే ఉన్నాం.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…