సినిమా టికెట్ రేట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్లు తగ్గించడంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు బాగా ఇబ్బంది పడ్డారు. కానీ రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం నాలుగు షోలకు అనుమతిచ్చింది. దీంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్లి సందడి’ వంటి సినిమాలకు మంచి లాభాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు టికెట్ రేట్లు పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రీసెంట్ గా ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఈ టికెట్ రేట్ల విషయంలో ఏమైనా సాయం చేయగలరా..? అని ఇండస్ట్రీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్.. విష్ణుకి బావ అవుతారు.
‘మా’ ఎన్నికల సమయంలో కూడా జగన్ మా బావ అంటూ విష్ణు ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. అయితే ఇప్పుడు విష్ణు కోరినా కూడా టికెట్ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకునేలా లేరు. ఆ డెసిషన్ సంక్రాంతికి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
సంక్రాంతి బరిలో ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కాబట్టి టికెట్ రేట్ల పెంపు జనవరిలో ఉండొచ్చని చెబుతున్నారు. 150 రూపాయలకు మించి రేట్లయితే పెరగవు కానీ కొన్ని సింగిల్ థియేటర్స్ లో 20, 30 రూపాయలకు టికెట్లను మాత్రం 50 నుంచి 55 రూపాయలను పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకారం తెలిపిందట. ప్రభుత్వం ఎలాంటి నియమాలు విధించినా.. భారీ సినిమాలు విడుదలైనప్పుడు మాత్రం ఎక్కువ రేట్లకు టికెట్లను అమ్మడం చూస్తూనే ఉన్నాం.
This post was last modified on October 23, 2021 11:37 am
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి జైలు కష్టాలను ఎలాగోలా తప్పించుకున్నా… గుంటూరులోని సీఐడీ…
ఈ నెల విడుదల కాబోతున్న నోటెడ్ సినిమాల్లో ఓదెల 2 బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీజర్ రాక…
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ నిజంగానే టికెట్లు కొట్టేందుకు పనికి రారు. టికెట్టు కొట్టడం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ఎదురైన పాఠాలే.. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు భవిష్యత్తు మార్గాలను చూపిస్తున్నాయా? ఆదిశగా…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామవరం మండలం…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) గ్యాస్ ధరలను పెంచుతూ…