Movie News

చిన్న సినిమా నుంచి భారీ చిత్రాలకు?

తెలుగులో చేసిన తొలి చిత్రం ఓ చిన్న హీరోతో. దాని బడ్జెట్ కూడా తక్కువ. పైగా ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇలా కెరీర్‌ను ఆరంభించిన అమ్మాయికి ఇండస్ట్రీలో ముందంజ వేయడం చాలా కష్టమే. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం తొలి సినిమా స్థాయి, ఫలితంతో సంబంధం లేకుండా తర్వాత అవకాశాలు అందుకుంటూ ఉంటారు. మీనాక్షి చౌదరి ఆ కోవకు చెందిన అమ్మాయిలాగే కనిపిస్తోంది.

2018లో మిస్ ఇండియా అయిన ఈ ఉత్తరాది బ్యూటీ.. అక్కినేని ఫ్యామిలీ కుర్రాడు సుశాంత్ సరసన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే మీనాక్షికి తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి. రవితేజ సరసన ‘ఖిలాడి’లో ఆమె రెండో కథానాయికగా ఎంపికైంది. ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’కి కూడా ఆమెనే కథానాయికగా ఎంపిక చేశారు. ఇవి రెండూ క్రేజీ చిత్రాలే కావడంతో మీనాక్షి తెలుగులో కథానాయికగా సెటిలైపోయేలాగే కనిపిస్తోంది.

ఐతే ఇప్పటిదాకా అందుకున్న అవకాశాలు ఒకెత్తయితే.. ఇప్పుడు ఆమె రెండు భారీ చిత్రాలకు పరిగణనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ హీరోలు ప్రభాస్, మహేష్ బాబులు కావడం విశేషం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ‘సలార్’లో ఒక ప్రత్యేక పాత్ర కోసం మీనాక్షిని ఎంచుకున్నారట. ఇందులో ఆమెది కథానాయిక పాత్ర కాదు. శ్రుతి హాసన్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించబోయే సినిమాలో మీనాక్షి ఒక కథానాయికగానే నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే మీనాక్షి దశ తిరిగినట్లే. ఆమె కెరీర్ పీక్స్‌ను అందుకోబోతున్నట్లే. మరి ఈ వార్తలు ఎప్పుడు అధికారికం అవుతాయో చూడాలి.

This post was last modified on October 22, 2021 10:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago