తెలుగులో చేసిన తొలి చిత్రం ఓ చిన్న హీరోతో. దాని బడ్జెట్ కూడా తక్కువ. పైగా ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇలా కెరీర్ను ఆరంభించిన అమ్మాయికి ఇండస్ట్రీలో ముందంజ వేయడం చాలా కష్టమే. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం తొలి సినిమా స్థాయి, ఫలితంతో సంబంధం లేకుండా తర్వాత అవకాశాలు అందుకుంటూ ఉంటారు. మీనాక్షి చౌదరి ఆ కోవకు చెందిన అమ్మాయిలాగే కనిపిస్తోంది.
2018లో మిస్ ఇండియా అయిన ఈ ఉత్తరాది బ్యూటీ.. అక్కినేని ఫ్యామిలీ కుర్రాడు సుశాంత్ సరసన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే మీనాక్షికి తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి. రవితేజ సరసన ‘ఖిలాడి’లో ఆమె రెండో కథానాయికగా ఎంపికైంది. ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’కి కూడా ఆమెనే కథానాయికగా ఎంపిక చేశారు. ఇవి రెండూ క్రేజీ చిత్రాలే కావడంతో మీనాక్షి తెలుగులో కథానాయికగా సెటిలైపోయేలాగే కనిపిస్తోంది.
ఐతే ఇప్పటిదాకా అందుకున్న అవకాశాలు ఒకెత్తయితే.. ఇప్పుడు ఆమె రెండు భారీ చిత్రాలకు పరిగణనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ హీరోలు ప్రభాస్, మహేష్ బాబులు కావడం విశేషం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ‘సలార్’లో ఒక ప్రత్యేక పాత్ర కోసం మీనాక్షిని ఎంచుకున్నారట. ఇందులో ఆమెది కథానాయిక పాత్ర కాదు. శ్రుతి హాసన్ ప్రభాస్కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించబోయే సినిమాలో మీనాక్షి ఒక కథానాయికగానే నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే మీనాక్షి దశ తిరిగినట్లే. ఆమె కెరీర్ పీక్స్ను అందుకోబోతున్నట్లే. మరి ఈ వార్తలు ఎప్పుడు అధికారికం అవుతాయో చూడాలి.
This post was last modified on October 22, 2021 10:05 am
తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీ.జోసెఫ్ విజయ్ అను నాను..…
ఇప్పటి హీరోల్లో వచ్చామా నటించామా వెళ్లిపోయామా అనుకునే వాళ్లు తక్కువమంది. కథా చర్చల్లో భాగమవుతున్నారు. స్క్రిప్టులు రాస్తున్నారు. దర్శకత్వం కూడా…
తమిళేనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్న స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అదినేత జోసెఫ్ విజయ్ కి…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒకప్పుడు ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేశాడో తెలిసిందే. ముఖ్యంగా ‘లగాన్’ దగ్గర్నుంచి…
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…