శివకార్తికేయన్ అని తమిళ యంగ్ హీరో. మన దగ్గర రవితేజ, విజయ్ దేవరకొండ తరహాలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పెద్ద స్టార్గా ఎదిగిన కుర్రాడితను. ఒకప్పుడు విజయ్ టీవీలో అతను వీడియో జాకీగా పని చేయడం విశేషం. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కొన్ని చేశాడు. ధనుష్తో మంచి అనుబంధం ఉండటం కలిసొచ్చి హీరో అయ్యాడు. వరుసగా హిట్లు కొట్టి చూస్తుండగానే స్టార్ అయిపోయాడు.
మధ్యలో కొన్ని సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చినా.. మళ్లీ పుంజుకున్నాడు. తాజాగా అతను ‘డాక్టర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి కరోనా నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. కానీ తర్వాత ఎందుకో మనసు మార్చుకుని దసరా ముంగిట థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ఊహించని స్పందన వచ్చింది ప్రేక్షకుల నుంచి.
కొంచెం థ్రిల్లింగ్గా.. అలాగే వినోదాత్మకంగా సాగిన ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వరుణ్ డాక్టర్’ పేరుతో రిలీజ్ చేశారు. విడుదల సమయంలో దీన్ని మన వాళ్లు పెద్దగా పట్టించుకోనట్లే కనిపించారు. దసరాకు ముందు వారాంతంలో రిలీజైన కొండపొలం, ఆరడుగుల బుల్లెట్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం, అదే సమయంలో ‘వరుణ్ డాక్టర్’ బాగుందన్న టాక్ రావడంతో నెమ్మదిగా అటు వైపు మళ్లారు. సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కూడా అయింది. దసరా టైంలో కూడా ఈ సినిమా బాగానే ఆడింది. బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది.
శివకార్తికేయన్ ఇంతకుముందు ‘రెమో’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘వరుణ్ డాక్టర్’తో అతడికి మంచి గుర్తింపే వచ్చింది. త్వరలో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ద్వారా నేరుగా తెలుగులోకి అడుగు పెట్టబోతున్నాడు శివ. దానికి ముందు ‘వరుణ్ డాక్టర్’ మంచి స్పందన తెచ్చుకుని అతడికి ఇక్కడ బేస్ ఏర్పడేలా చేసింది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తుండటం విశేషం. ‘లవ్ స్టోరి’ నిర్మాతలు ప్రొడ్యూస్ చేయనున్న ఈ చిత్రానికి శివ రూ.25 కోట్ల పారితోషకం అందుకోనున్నట్లుగా వార్తలొస్తుండటం విశేషం.
This post was last modified on October 20, 2021 6:35 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…