ఈసారి దసరాకు మూడు సినిమాలు రిలీజైతే.. వాటిలో ఎక్కువ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘మహాసముద్రం’ అనే చెప్పాలి. ఎందుకంటే అది ‘ఆర్ఎక్స్ 100’ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత అజయ్ భూపతి తీసిన సినిమా. శర్వానంద్-సిద్ధార్థ్-అదితిరావు హైదరిల క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించాడు. దీని రెండు ట్రైలర్లూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి.
మంచి హైప్ మధ్య రిలీజైంది ‘మహాసముద్రం’. కానీ అంచనాలకు చాలా దూరంలో సినిమా నిలిచిపోయింది. అజయ్ భూపతి చెప్పినంత లోతు సినిమాలో అస్సలు కనిపించలేదు. ఐతే అంచనాలను అందుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. దసరా సీజన్లో రిలీజైన ‘పెళ్ళిసంద-డి’ చిత్రంతో పోలిస్తే ‘మహాసముద్రం’ ఎంతో మెరుగనే చెప్పాలి. దాంతో పోలిస్తే దీనికి స్టార్ కాస్ట్ కూడా ఉంది.
కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘పెళ్లిసంద-డి’ పైచేయి సాధిస్తుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ‘మహాసముద్రం’ డిజాస్టర్ కాగా.. ‘పెళ్ళిసంద-డి’ మాత్రం హిట్ స్టేటస్ అందుకుంది. నాసిరకం, పాత శైలి కథాకథనాలతో తెరకెక్కినప్పటికీ.. చూడముచ్చటైన కొత్త జంట, అందంగా తీర్చిదిద్దిన పాటలు ‘పెళ్ళిసందడి’కి ప్లస్ అయ్యాయి.
రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి పెద్దగా బజ్ లేకపోవడం.. మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల మీద ఎక్కువ అంచనాలుండటంతో దీనికి చాలా పరిమితంగా థియేటర్లు దక్కాయి. మేజర్ స్క్రీన్లను మిగతా రెండు చిత్రాలే పంచుకున్నాయి. ఐతే రిలీజ్ తర్వాత ‘మహాసముద్రం’ మీద ప్రేక్షకులకు ఆసక్తి లేకపోవడం, మరోవైపు ‘పెళ్ళిసంద-డి’కి స్పందన బాగుండటంతో దాని స్క్రీన్లు తగ్గించి దీనికి ఇచ్చేశారు. రిలీజ్ రోజుతో పోలిస్తే తర్వాతి రోజు నుంచి ‘పెళ్ళిసంద-డి’కి థియేటర్లు పెరగడం విశేషం.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…