అఖిల్ సినిమాతో ఎన్నో అంచనాల మధ్య హీరోగా అరంగేట్రం చేసి.. తీవ్ర నిరాశ ఎదుర్కొన్నాడు అక్కినేని కుర్రాడు అఖిల్. అతను ఆ తర్వాత నటించిన రెండు చిత్రాలు హలో, మిస్టర్ మజ్ను సైతం ఆడలేదు. ఇప్పుడు అతడి ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీదే ఉన్నాయి. ఈ సినిమాతో తొలి విజయాన్నందుకుంటానన్న ఆశతో అఖిల్ ఉన్నాడు.
ఇది బాగా ఆడితే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్న ఏజెంట్ మూవీతో స్టార్ ఇమేజ్ సంపాదించి, అభిమానులను మురిపించాలని కోరుకుంటున్నాడు. ఇంకా తొలి విజయం అనుకోకముందే ఇలాంటి మెగా మూవీ సెట్ కావడం విశేషమే. ఈ చిత్రం మీద నిర్మాత అనిల్ సుంకర రూ.50 కోట్ల దాకా బడ్జెట్ పెట్టడానికి సిద్ధమైనట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయినా ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లినట్లు ఏమీ అప్డేట్ బయటికి రాలేదు. అఖిల్, సురేందర్ కథా చర్చల్లో పాల్గొన్న ఫొటోలు రిలీజ్ చేశారు తప్ప.. షూటింగ్ గురించి ఊసే లేదు. అఖిల్ చాన్నాళ్ల నుంచి ఈ సినిమా కోసం లుక్ మార్చుకుని సిద్ధమవుతున్నాడు కానీ.. సినిమా అసలెప్పుడు పట్టాలెక్కుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నదే తెలియడం లేదు.
ఐతే ఎట్టకేలకు అఖిల్ ఏజెంట్ గురించి అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోయిందని వెల్లడించాడు. షూటింగ్ చాలా స్పీడుగా సాగుతోందని.. ఐతే ఈ ఏడాది మాత్రం ఏజెంట్ రిలీజ్ కాదని.. వచ్చే వేసవికి కూడా అది రిలీజవుతుందని గ్యారెంటీగా చెప్పలేనని అన్నాడు. మొత్తానికి ఏజెంట్ షూటింగ్ మొదలై, స్పీడుగా జరుగుతోందన్న కబురు అక్కినేని అభిమానులకు ఆనందాన్నిచ్చేదే. మరి అఖిల్ ఆశిస్తున్నట్లు శుక్రవారం రిలీజవుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్టయి.. ఏజెంట్తో అతనుమరో స్థాయికి చేరతాడేమో చూద్దాం.
This post was last modified on October 15, 2021 10:08 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…