టాలీవుడ్ ఓ విషాద వార్తతో నిద్ర లేచింది ఈ రోజు. ప్రముఖ పీఆర్వో, నిర్మాత మహేష్ కోనేరు గుండెపోటుతో హఠాత్తుగా చనిపోవడం అందరికి పెద్ద షాకే. ఇండస్ట్రీలో చాలా మంచి పేరున్న వ్యక్తి, నిర్మాతగా ఎదుగుతున్న దశలో, తక్కువ వయసులో ఇలా హఠాత్తుగా కన్నమూయడం పరిశ్రమలోని వారికే కాదు.. సినీ అభిమానులకు కూడా జీర్ణించుకోలేని విషయమే. మహేష్ మృతి నందమూరి అన్నదమ్ములు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లకు ఎంత పెద్ద లోటు అన్నది వారి సన్నిహితులకే తెలుసు. ఒక రకంగా కుటుంబ సభ్యుణ్ని కోల్పోయిన బాధలోనే ఉన్నారు వాళ్లిద్దరూ. గత కొన్నేళ్లలో సోదరుడు జానకిరామ్, తండ్రి హరికృష్ణలను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోయారు తారక్, కళ్యాణ్ రామ్. ఇప్పుడు సినిమాల పరంగా తమకు అన్నీ చూసుకునే వ్యక్తిని దూరం చేసుకున్నారు.
సినిమాల కోసం, అలాగే హీరోల కోసం పీఆర్వోలు పని చేయడం ఇండస్ట్రీలో మామూలే. ఐతే మహేష్.. తారక్, కళ్యాణ్ రామ్లకు కేవలం పీఆర్వో మాత్రమే కాదు.. అంతకుమించి అవసరాలు తీర్చే వ్యక్తి. వీళ్లిద్దరి డేట్లను మేనేజ్ చేసేది అతనే. వీళ్లిద్దరి ప్రతి సినిమాలోనూ ఏదో రకంగా మహేష్ భాగస్వామ్యం ఉంటుంది. కథలు వినడం, కాంబినేషన్లు సెట్ చేయడం, మీడియా వ్యవహారాలను చూడటం.. అలాగే అభిమానులతో కోఆర్డినేషన్, సోషల్ మీడియా మేనేజ్మెంట్.. ఇలా చాలా పనులే చేసిపెడతాడు మహేష్.
కళ్యాణ్ రామ్కు సంబంధించి ఎన్టీఆర్ ఆర్ట్స్ వ్యవహారాలను కూడా చాలా వరకు చక్కబెట్టేది మహేషే. తారక్, కళ్యాణ్ రామ్లకు సంబంధించి ఏ వార్త మీడియాకు చేరాలన్నా.. వారి నుంచి ఏ క్లారిఫికేషన్ రావాలన్నా.. అది మహేష్ నుంచే ఉంటుంది.
నిర్మాతగా మారాక కూడా ఈ పనులన్నీ కొనసాగిస్తున్నాడు మహేష్. తమకింత చేస్తున్నాడు కాబట్టే అతను నిర్మాతగా మారడానికి, వరుసగా సినిమాలు నిర్మించడానికి సహకారం అందిస్తున్నారు నందమూరి అన్నదమ్ములు. ఇంతగా వారు ఆధారపడే వ్యక్తి ఇప్పుడిలా అర్ధంతరంగా తనువు చాలించడం ఈ బ్రదర్స్కు పెద్ద దెబ్బే. తారక్ ‘ఆర్ఆర్ఆర్’తో కెరీర్లో మరో స్థాయికి చేరబోతున్న తరుణంలో ఆ సినిమా చూడకుండానే మహేష్ వెళ్లిపోవడం కూడా అతడి సన్నిహితులను మరింత బాధ పెడుతోంది.
This post was last modified on October 12, 2021 6:24 pm
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…