‘ఆహా’ ఓటీటీ కోసం నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షో చేయబోతున్నాడని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలయ్య ఏంటి.. టాక్ షో చేయడమేంటి.. అందులోనూ మెగా ఫ్యామిలీకి చెందిన ఆహా ఓటీటీలో ఆయన షో ప్రసారం కావడం ఏంటి అని అందరూ షాకయ్యారు. కానీ చివరికి అదే నిజమని తేలింది. ఇటీవలే ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియో షూటింగ్ కూడా మొదలు కావడంతో ‘ఆహా’లో బాలయ్య కనిపించబోతుండటం నిజమేనని రూఢి అయింది.
ఇప్పడు దీనిపై అధికారిక సమాచారం కూడా వచ్చేసింది. షో గురించి ‘ఆహా’నే స్వయంగా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ‘ది బాప్ ఆఫ్ ఆల్ షోస్’ అంటూ ఈ షోకు ఇంట్రో ఇచ్చారు. బాలయ్యను నేరుగా చూపించకుండా ఆయన లుక్ను షేడ్స్ ద్వారా చూపించి నందమూరి హీరో ‘ఆహా’ కనిపించనున్న సంగతి నిజమే అని తేల్చేశారు. ‘బాలయ్య ఆన్ ఆహా’ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టడంతో ఇక ఈ షో విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ షో తొలి ఎపిసోడ్లో మోహన్ బాబు, ఆయన పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న అతిథులుగా రాబోతున్నట్లు కూడా వార్తలు బయటికి రావడం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆదివారం మరో షోలో ఓ విశిష్ఠ అతిథి పాల్గొనబోతున్న విషయం కూడా అధికారికం అయింది. జెమిని టీవీలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో సమంత పాల్గొన్న విషయం అఫీషియల్ అయింది. ఆమె ఎపిసోడ్ తాలూకు ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఏ రోజు ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యేది వెల్లడించలేదు కానీ.. దసరా నవరాత్రుల స్పెషల్గా ఈ ఎపిసోడ్ రాబోతోందని ప్రకటించారు. ఆరెంజ్ కలర్ టాప్లో చాలా హుషారుగా కనిపించిన సమంత ఈ ఎపిసోడ్కు ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది.
This post was last modified on October 10, 2021 1:14 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…