‘ఆహా’ ఓటీటీ కోసం నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షో చేయబోతున్నాడని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలయ్య ఏంటి.. టాక్ షో చేయడమేంటి.. అందులోనూ మెగా ఫ్యామిలీకి చెందిన ఆహా ఓటీటీలో ఆయన షో ప్రసారం కావడం ఏంటి అని అందరూ షాకయ్యారు. కానీ చివరికి అదే నిజమని తేలింది. ఇటీవలే ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియో షూటింగ్ కూడా మొదలు కావడంతో ‘ఆహా’లో బాలయ్య కనిపించబోతుండటం నిజమేనని రూఢి అయింది.
ఇప్పడు దీనిపై అధికారిక సమాచారం కూడా వచ్చేసింది. షో గురించి ‘ఆహా’నే స్వయంగా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ‘ది బాప్ ఆఫ్ ఆల్ షోస్’ అంటూ ఈ షోకు ఇంట్రో ఇచ్చారు. బాలయ్యను నేరుగా చూపించకుండా ఆయన లుక్ను షేడ్స్ ద్వారా చూపించి నందమూరి హీరో ‘ఆహా’ కనిపించనున్న సంగతి నిజమే అని తేల్చేశారు. ‘బాలయ్య ఆన్ ఆహా’ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టడంతో ఇక ఈ షో విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ షో తొలి ఎపిసోడ్లో మోహన్ బాబు, ఆయన పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న అతిథులుగా రాబోతున్నట్లు కూడా వార్తలు బయటికి రావడం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆదివారం మరో షోలో ఓ విశిష్ఠ అతిథి పాల్గొనబోతున్న విషయం కూడా అధికారికం అయింది. జెమిని టీవీలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో సమంత పాల్గొన్న విషయం అఫీషియల్ అయింది. ఆమె ఎపిసోడ్ తాలూకు ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఏ రోజు ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యేది వెల్లడించలేదు కానీ.. దసరా నవరాత్రుల స్పెషల్గా ఈ ఎపిసోడ్ రాబోతోందని ప్రకటించారు. ఆరెంజ్ కలర్ టాప్లో చాలా హుషారుగా కనిపించిన సమంత ఈ ఎపిసోడ్కు ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది.
This post was last modified on October 10, 2021 1:14 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…