మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పుణ్యమా అని టాలీవుడ్లో ఎంతటి చిచ్చు రేగిందో తెలిసిందే. ఇండస్ట్రీ జనాల్లో లోలోన ఎన్ని గొడవలు, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. ఒకరి గురించి ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసిన ఉదంతాలు అరుదుగా కనిపిస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా నోరు జారడం, ఒక మాట అనడం మినహాయిస్తే.. వ్యక్తుల్ని టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు పెద్దగా కనిపించవు.
కానీ మా ఎన్నికల్లో రెండు ప్యానెళ్ల వాళ్లు ఒకరి మీద ఒకరు దారుణమైన మాటలు అనుకున్నారు. విమర్శలు చేసుకున్నారు. ఆరోపణలకు వెళ్లారు. అవి చివరికి మరీ శ్రుతి మించిపోయి వ్యక్తిగత వ్యాఖ్యలు, దూషణల్లోకి దిగిపోయారు. ఇందులో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. తాజాగా ప్రకాష్ రాజ్కు మద్దతుదారైన నాగబాబు ఓ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ పూర్తిగా అదుపు తప్పిపోయారు.
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకరైన కోట శ్రీనివాసరావు గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని కోట వ్యతిరేకిస్తుండటం, ఆయనకు ఎందుకు మద్దతిస్తున్నారని చిరంజీవిని కూడా ప్రశ్నించినట్లు పేర్కొనడం తెలిసిందే. దీనిపై నాగబాబు మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడు. అతను ఐదుసార్లు జాతీయ అవార్డు సాధించాడు.
తెలుగు ఇండస్ట్రీకి పేరు తెచ్చాడు. ఈ కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ లాంటి వాళ్ల కంటే అతను సుపీరియర్ యాక్టర్ కదా. వీళ్లందరూ అతనంటే అసూయతో కుంగిపోతున్నారు ఎందుకు? అయినా ఆ కోట శ్రీనివాసరావుకు ఎందుకండీ ఈ వయసులో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు వూడిపోతాడో తెలియదు. అనకూడదు కానీ ఈ మాట. అతని వయసుకు తగిన మాట మాట్లాడట్లా. అతని మాటలు విని విని విసుగొస్తోంది. ప్రకాష్ రాజ్ మన భాష కాకపోతే తరిమేస్తారా? నటులకు మన, పర ఏంటండీ. వీళ్లా నటులు. నటులంటే విశాల దృక్పథం ఉండాలి. వీళ్లకు మానవత్వం లేదు. నటన విషయంలో వీళ్లందరూ ప్రకాష్ రాజ్ కాలి గోటికి కూడా సరిపోరు అని నాగబాబు అనేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారమే రేపుతున్నాయి.
This post was last modified on October 10, 2021 6:35 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…