మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పుణ్యమా అని టాలీవుడ్లో ఎంతటి చిచ్చు రేగిందో తెలిసిందే. ఇండస్ట్రీ జనాల్లో లోలోన ఎన్ని గొడవలు, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. ఒకరి గురించి ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసిన ఉదంతాలు అరుదుగా కనిపిస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా నోరు జారడం, ఒక మాట అనడం మినహాయిస్తే.. వ్యక్తుల్ని టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు పెద్దగా కనిపించవు.
కానీ మా ఎన్నికల్లో రెండు ప్యానెళ్ల వాళ్లు ఒకరి మీద ఒకరు దారుణమైన మాటలు అనుకున్నారు. విమర్శలు చేసుకున్నారు. ఆరోపణలకు వెళ్లారు. అవి చివరికి మరీ శ్రుతి మించిపోయి వ్యక్తిగత వ్యాఖ్యలు, దూషణల్లోకి దిగిపోయారు. ఇందులో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. తాజాగా ప్రకాష్ రాజ్కు మద్దతుదారైన నాగబాబు ఓ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ పూర్తిగా అదుపు తప్పిపోయారు.
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకరైన కోట శ్రీనివాసరావు గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని కోట వ్యతిరేకిస్తుండటం, ఆయనకు ఎందుకు మద్దతిస్తున్నారని చిరంజీవిని కూడా ప్రశ్నించినట్లు పేర్కొనడం తెలిసిందే. దీనిపై నాగబాబు మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడు. అతను ఐదుసార్లు జాతీయ అవార్డు సాధించాడు.
తెలుగు ఇండస్ట్రీకి పేరు తెచ్చాడు. ఈ కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ లాంటి వాళ్ల కంటే అతను సుపీరియర్ యాక్టర్ కదా. వీళ్లందరూ అతనంటే అసూయతో కుంగిపోతున్నారు ఎందుకు? అయినా ఆ కోట శ్రీనివాసరావుకు ఎందుకండీ ఈ వయసులో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు వూడిపోతాడో తెలియదు. అనకూడదు కానీ ఈ మాట. అతని వయసుకు తగిన మాట మాట్లాడట్లా. అతని మాటలు విని విని విసుగొస్తోంది. ప్రకాష్ రాజ్ మన భాష కాకపోతే తరిమేస్తారా? నటులకు మన, పర ఏంటండీ. వీళ్లా నటులు. నటులంటే విశాల దృక్పథం ఉండాలి. వీళ్లకు మానవత్వం లేదు. నటన విషయంలో వీళ్లందరూ ప్రకాష్ రాజ్ కాలి గోటికి కూడా సరిపోరు అని నాగబాబు అనేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారమే రేపుతున్నాయి.
This post was last modified on October 10, 2021 6:35 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…