మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పుణ్యమా అని టాలీవుడ్లో ఎంతటి చిచ్చు రేగిందో తెలిసిందే. ఇండస్ట్రీ జనాల్లో లోలోన ఎన్ని గొడవలు, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. ఒకరి గురించి ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసిన ఉదంతాలు అరుదుగా కనిపిస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా నోరు జారడం, ఒక మాట అనడం మినహాయిస్తే.. వ్యక్తుల్ని టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు పెద్దగా కనిపించవు.
కానీ మా ఎన్నికల్లో రెండు ప్యానెళ్ల వాళ్లు ఒకరి మీద ఒకరు దారుణమైన మాటలు అనుకున్నారు. విమర్శలు చేసుకున్నారు. ఆరోపణలకు వెళ్లారు. అవి చివరికి మరీ శ్రుతి మించిపోయి వ్యక్తిగత వ్యాఖ్యలు, దూషణల్లోకి దిగిపోయారు. ఇందులో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. తాజాగా ప్రకాష్ రాజ్కు మద్దతుదారైన నాగబాబు ఓ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ పూర్తిగా అదుపు తప్పిపోయారు.
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకరైన కోట శ్రీనివాసరావు గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని కోట వ్యతిరేకిస్తుండటం, ఆయనకు ఎందుకు మద్దతిస్తున్నారని చిరంజీవిని కూడా ప్రశ్నించినట్లు పేర్కొనడం తెలిసిందే. దీనిపై నాగబాబు మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడు. అతను ఐదుసార్లు జాతీయ అవార్డు సాధించాడు.
తెలుగు ఇండస్ట్రీకి పేరు తెచ్చాడు. ఈ కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ లాంటి వాళ్ల కంటే అతను సుపీరియర్ యాక్టర్ కదా. వీళ్లందరూ అతనంటే అసూయతో కుంగిపోతున్నారు ఎందుకు? అయినా ఆ కోట శ్రీనివాసరావుకు ఎందుకండీ ఈ వయసులో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు వూడిపోతాడో తెలియదు. అనకూడదు కానీ ఈ మాట. అతని వయసుకు తగిన మాట మాట్లాడట్లా. అతని మాటలు విని విని విసుగొస్తోంది. ప్రకాష్ రాజ్ మన భాష కాకపోతే తరిమేస్తారా? నటులకు మన, పర ఏంటండీ. వీళ్లా నటులు. నటులంటే విశాల దృక్పథం ఉండాలి. వీళ్లకు మానవత్వం లేదు. నటన విషయంలో వీళ్లందరూ ప్రకాష్ రాజ్ కాలి గోటికి కూడా సరిపోరు అని నాగబాబు అనేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారమే రేపుతున్నాయి.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…