ఆరడుగుల బుల్లెట్.. ఏడెనిమిదేళ్ల ముందు మొదలైన సినిమా. మేకింగ్ దశలో ఉండగా ఆర్థిక సమస్యలు, ఇంకేవో ఇబ్బందులు తలెత్తి ఏళ్లకు ఏళ్లు ఆలస్యమైందీ చిత్రం. ఎలాగోలా సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తే నాలుగేళ్ల కిందట రిలీజ్ రోజు ఉదయం ఆ చిత్రానికి బ్రేక్ పడింది. ఇక ఆ తర్వాత సినిమా అడ్రస్ లేదు. ఇక ఎప్పటికీ ఈ సినిమా విడుదలే కాదనుకుంటే.. ఇటీవల గోపీచంద్ సినిమా సీటీమార్ థియేటర్లలో కొంచెం సందడి చేయడంతో ఈ చిత్రాన్ని బయటికి తీశారు. ఎలాగోలా కష్టపడి శుక్రవారం ఆరడుగుల బుల్లెట్ను థియేటర్లలోకి దించారు.
కానీ చాలా తక్కువ అంచనాలతో థియేటర్లకు వెళ్లినప్పటికీ ఈ సినిమా తీవ్ర నిరాశకే గురి చేసింది. ఏడెనిమిదేళ్ల ముందు మొదలుపెట్టిన సినిమా, పైగా ఎప్పుడో ఔట్ డేట్ అయిపోయిన బి.గోపాల్ డైరెక్షన్.. కాబట్టి సినిమా ఏమాత్రం కొత్తగా ఉండదని, రొటీన్ మాస్ మూవీనే అనుకుని తక్కువ అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులకు మరీ ఔట్ డేటెడ్ మూవీ చూపించి తీవ్ర నిరాశకు గురి చేశాడు గోపాల్. ఆవారా తిరిగే కొడుకు.. అతణ్ని అపార్థం చేసుకుని ఇంటి నుంచి వెళ్లగొట్టే తండ్రి.. కట్ చేస్తే విలన్ వల్ల తండ్రికి కష్టమొస్తే తిరిగి ఆ కొడుకే కాపాడే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ లైన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.
వక్కంతం వంశీ సినిమాలంటే ఏదో ఒక ట్విస్ట్, టిపికల్ హీరో క్యారెక్టరైజేషన్ ఉంటాయి. కానీ ఇందులో అవేమీ లేవు. ఇక ఆరేళ్ల ముందే చనిపోయిన ఎమ్మెస్ నారాయణ.. గత కొన్నేళ్లలో తనువు చాలించిన జయప్రకాష్ రెడ్డి, గుండు హనుమంతరావు లాంటి వాళ్లు తెరపై కనిపించడం, బ్రహ్మానందం ఒకప్పటి స్టయిల్లో కామెడీ చేయడం.. మిగతా ఆర్టిస్టులు కూడా పాత లుక్స్లో కనిపించడంతో ఈ సినిమా మరింత ఔట్ డేటెడ్ అనిపించింది. హీరో గోపీచంద్ ఈ సినిమాను పట్టించుకోకపోవడం, ప్రమోషన్లు కూడా పెద్దగా లేకపోవడంతో ఆరడుగుల బుల్లెట్ రిలీజైందంటే రిలీజైంది అనిపించి మరుగున పడిపోయేలా కనిపిస్తోంది.
This post was last modified on October 9, 2021 7:59 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…