మా వ్యక్తిగత విషయాల గురించి మీకెందుకు.. మాక్కొంచెం ప్రైవసీ ఇవ్వండి అంటూ.. ఫిలిం సెలబ్రెటీలు అసహనం వ్యక్తం చేస్తుంటారు. విన్నపాలూ చేస్తారు. కానీ సినీ జనాల వ్యక్తిగత విషయాల గురించి జనాలకు ఉండే ఆసక్తే వేరు. ఈ సోషల్ మీడియా రోజుల్లో మిగతా విషయాలకంటే వాటి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. గత కొన్ని వారాలుగా నాగచైతన్య-సమంతల వైవాహిక బంధం దెబ్బ తినడంపై ఎంత చర్చ నడుస్తోందో తెలిసిందే. అది ఎంతకీ ఆగడం లేదు.
ముందు వాళ్లిద్దరి విడాకుల గురించ ఊహాగానాలు నడిచాయి. ఆ తర్వాత వారి నుంచి అధికారిక ప్రకటన రాగానే.. ఆ విడాకులకు దారి తీసిన కారణాల మీద ఎడతెగని చర్చ నడుస్తోంది. ఈ సోషల్ మీడియా కాలంలో దీన్ని నివారించడం అసాధ్యం అనే చెప్పాలి. తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చిన మరో పర్సనల్ ఫొటో గురించి కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ఇదేమీ కొత్తది కూడా కాదు.
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్.. తెలుగులో కొన్నేళ్లుగా క్యారెక్టర్ రోల్స్తో ఆకట్టుకుంటున్న కన్నడ నటి పవిత్ర లోకేష్లకు సంబంధించిన ఫొటో ఇది. తాజాగా కృష్ణ కూతురు ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అందులో కృష్ణతో పాటు నరేష్, గల్లా అశోక్, నరేష్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఐతే నరష్ పక్కన పవిత్ర లోకేష్ కూడా ఉండటం అందరి దృష్టినీ ఆకర్షించింది. సినీయేతర కార్యక్రమాల్లో నరేష్తో పవిత్ర కనిపించడం ఇది తొలిసారేమీ కాదు. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి కనిపించినపుడు అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఈ మధ్య అందరూ వీరి కలయికకు అలవాటు పడిపోయారు. ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.
‘సమ్మోహనం’ సినిమా కోసం భార్యాభర్తలుగా కలిసి నటించినప్పటి నుంచి వీరి మధ్య బంధం బలపడినట్లు తెలుస్తోంది. ఐతే నరేష్.. ఒక పెళ్లి తర్వాత, కొన్నేళ్ల కిందట హిందూపురంలో రెండో వివాహం చేసుకోవడం తెలిసిందే. పవిత్ర కూడా సుచేంద్ర ప్రసాద్ అనే కన్నడ నటుడిని 2007లో పెళ్లి చేసుకుంది. ఆయనకది రెండో వివాహం. ఆయనతో ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్లిద్దరూ విడిపోయినట్లు అయితే వార్తలేమీ రాలేదు. మరోవైపు నరేష్ రెండో భార్య నుంచి విడిపోయినట్లు కూడా మీడియాలో ఏ సమాచారం రాలేదు. ఈ నేపథ్యంలో వీరి బంధం చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on October 8, 2021 10:23 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…