హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న కాజల్.. ఇప్పుడు నిర్మాతగానూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ హీరోగా ‘మనుచరిత్ర’ అనే సినిమాను ఎన్. శ్రీనివాస్రెడ్డి, రాన్సన్ జోసెఫ్లతో కలిసి నిర్మిస్తోంది. కొత్త దర్శకుడు భరత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లు.
ఈ మూవీ ప్రీఫేస్ని తాజాగా రిలీజ్ చేశారు. దాన్ని బట్టి ఇదో ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా అని అర్థమవుతోంది. ముగ్గురమ్మాయిల వల్ల ఇబ్బందులు పడే అబ్బాయిగా శివ కనిపిస్తున్నాడు. ‘ప్రేమలో పడటం ఓ బాధాకరమైన ఆనందం’ అనే ట్యాగ్లైన్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుకు తగ్గట్టే తీవ్రమైన బాధలో కనిపిస్తున్నాడు శివ. ఇలా బతకడం కంటే చావడం బెటర్ అని ఆత్మీయులు తిట్టేంతగా కుమిలిపోతున్నాడు. కాస్త వయొలెంట్గా కూడా కనిపిస్తున్నాడు. టోటల్గా ఇదెంతో లోతైన, బరువైన కాన్సెప్ట్ అని ఈ వీడియో ద్వారా అర్థమయ్యింది. అసలు కథేంటి, శివ జీవితంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కలిగింది. గోపిసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.
మొత్తానికి నిర్మాతగా మారడానికి కాజల్ మంచి కాన్సెప్టే ఎంచుకుందనిపిస్తోంది. నిజానికామె ప్రశాంత్ వర్మ మూవీతో కానీ, సుధీర్ వర్మ సినిమాతో కానీ ప్రొడ్యూసర్ అవుతుందని, ఓ ఫేమస్ హీరో చిత్రాన్ని నిర్మిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ శివ లాంటి న్యూ అండ్ యంగ్ హీరోని సెలెక్ట్ చేసుకుందంటే, కచ్చితంగా కాన్సెప్ట్ మీద నమ్మకమే అయ్యుండొచ్చు. అదొక్కటీ చాలు కదా, ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడటానికి!
This post was last modified on October 7, 2021 1:27 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…