టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. విడాకుల వ్యవహారం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
అలాంటిది ఒక్కసారిగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయంలో పలు కథనాలు వస్తున్నాయి. సినీ తారలు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు.
కొంతమంది ఈ విషయంలో సమంతను సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు చైతన్యకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా నాగచైతన్య-సమంత విడాకులపై నటుడు రాజీవ్ కానుకగా కూడా స్పందించారు. ఇటీవల విడుదలైన ‘లవ్ స్టోరీ’ సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించారు రాజీవ్ కనకాల. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చై -సామ్ విడుదకులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నాగచైతన్య-సమంత విడాకులపై స్పందించనని.. అది వాళ్ల వ్యక్తిగతమని అన్నారు. వాళ్లు విడిపోవడం చాలామందికి బాధ కలిగించిందని.. తనకు కూడా బాధగానే ఉందని అన్నారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ ఏం తెలియదని.. కాబట్టి వాళ్ల జీవితాలపై స్పందించే అర్హత మనకు లేదని చెప్పారు. కానీ చైతన్య చాలా మంచి వ్యక్తి అని.. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడని.. విసుగు అంటే ఏంటో తెలీదని గొప్పగా చెప్పారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా చైతుని ప్రేమిస్తారని.. అంత మంచి నేచర్ ఉన్న వ్యక్తి అని తెలిపారు.
This post was last modified on October 6, 2021 1:56 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…