టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. విడాకుల వ్యవహారం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
అలాంటిది ఒక్కసారిగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయంలో పలు కథనాలు వస్తున్నాయి. సినీ తారలు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు.
కొంతమంది ఈ విషయంలో సమంతను సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు చైతన్యకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా నాగచైతన్య-సమంత విడాకులపై నటుడు రాజీవ్ కానుకగా కూడా స్పందించారు. ఇటీవల విడుదలైన ‘లవ్ స్టోరీ’ సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించారు రాజీవ్ కనకాల. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చై -సామ్ విడుదకులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నాగచైతన్య-సమంత విడాకులపై స్పందించనని.. అది వాళ్ల వ్యక్తిగతమని అన్నారు. వాళ్లు విడిపోవడం చాలామందికి బాధ కలిగించిందని.. తనకు కూడా బాధగానే ఉందని అన్నారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ ఏం తెలియదని.. కాబట్టి వాళ్ల జీవితాలపై స్పందించే అర్హత మనకు లేదని చెప్పారు. కానీ చైతన్య చాలా మంచి వ్యక్తి అని.. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడని.. విసుగు అంటే ఏంటో తెలీదని గొప్పగా చెప్పారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా చైతుని ప్రేమిస్తారని.. అంత మంచి నేచర్ ఉన్న వ్యక్తి అని తెలిపారు.
This post was last modified on October 6, 2021 1:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…