లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రెండున్నర నెలలుగా సినీ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. షూటింగులు జరగట్లేదు. థియేటర్లు నడవట్లేదు. ఐతే థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేదని స్పష్టమైపోయింది. ఐతే షూటింగ్లకు అయినా అనుమతి ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను సినీ పరిశ్రమల ప్రతినిధులు కోరుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. చర్చలు జరిగాయి. త్వరలోనే దీనిపై మార్గదర్శకాలు రాబోతున్నాయి. ఈలోపు కరోనా ఉద్దృతి తీవ్ర స్థాయిలో ఉన్న మహారాష్ట్రలో షూటింగులకు అనుమతులు లభించడం విశేషం. బాలీవుడ్కు కేంద్రం అయిన ముంబయిలో షూటింగ్స్ పునఃప్రారంభం కానున్నాయి. కొన్ని షరతులు పాటిస్తూ షూటింగులు జరుపుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
అయితే, సినిమాలకు సంబంధించి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు షూటింగ్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతులు ఇస్తూనే కొన్ని షరతులు విధించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం షూటింగ్లు జరిగే చోట తప్పకుండా అందరూ భౌతిక దూరం పాటించాలి. ఆ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుండాలి. అదే విధంగా నటీనటులు మేకప్మెన్లను పెట్టుకోకుండా సొంతంగానే మేకప్లు వేసుకోవాల్సి ఉంటుంది.
ఇక షూటింగ్లో భాగంగా ముద్దులు, కౌగిలింతలు నిషేధం. ఫైట్ సన్నివేశాలు కూడా ఇప్పుడు నివారించాలని సూచించారు. ఇప్పట్లో ఈ సన్నివేశాలకు అవకాశం లేదు. అదే విధంగా పెళ్లి సన్నివేశాలు, మార్కెట్ తరహా రద్దీగా కనిపించే సీన్స్కు కూడా అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు కట్టుబడి జాగ్రత్తగా షూటింగ్లు మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. దాదాపు ఇవే మార్గదర్శకాల్ని మిగతా రాష్ట్రాలూ సూచించే అవకాశముంది.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…