లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రెండున్నర నెలలుగా సినీ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. షూటింగులు జరగట్లేదు. థియేటర్లు నడవట్లేదు. ఐతే థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేదని స్పష్టమైపోయింది. ఐతే షూటింగ్లకు అయినా అనుమతి ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను సినీ పరిశ్రమల ప్రతినిధులు కోరుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. చర్చలు జరిగాయి. త్వరలోనే దీనిపై మార్గదర్శకాలు రాబోతున్నాయి. ఈలోపు కరోనా ఉద్దృతి తీవ్ర స్థాయిలో ఉన్న మహారాష్ట్రలో షూటింగులకు అనుమతులు లభించడం విశేషం. బాలీవుడ్కు కేంద్రం అయిన ముంబయిలో షూటింగ్స్ పునఃప్రారంభం కానున్నాయి. కొన్ని షరతులు పాటిస్తూ షూటింగులు జరుపుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
అయితే, సినిమాలకు సంబంధించి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు షూటింగ్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతులు ఇస్తూనే కొన్ని షరతులు విధించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం షూటింగ్లు జరిగే చోట తప్పకుండా అందరూ భౌతిక దూరం పాటించాలి. ఆ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుండాలి. అదే విధంగా నటీనటులు మేకప్మెన్లను పెట్టుకోకుండా సొంతంగానే మేకప్లు వేసుకోవాల్సి ఉంటుంది.
ఇక షూటింగ్లో భాగంగా ముద్దులు, కౌగిలింతలు నిషేధం. ఫైట్ సన్నివేశాలు కూడా ఇప్పుడు నివారించాలని సూచించారు. ఇప్పట్లో ఈ సన్నివేశాలకు అవకాశం లేదు. అదే విధంగా పెళ్లి సన్నివేశాలు, మార్కెట్ తరహా రద్దీగా కనిపించే సీన్స్కు కూడా అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు కట్టుబడి జాగ్రత్తగా షూటింగ్లు మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. దాదాపు ఇవే మార్గదర్శకాల్ని మిగతా రాష్ట్రాలూ సూచించే అవకాశముంది.
This post was last modified on June 2, 2020 1:51 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…