లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రెండున్నర నెలలుగా సినీ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. షూటింగులు జరగట్లేదు. థియేటర్లు నడవట్లేదు. ఐతే థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేదని స్పష్టమైపోయింది. ఐతే షూటింగ్లకు అయినా అనుమతి ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను సినీ పరిశ్రమల ప్రతినిధులు కోరుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. చర్చలు జరిగాయి. త్వరలోనే దీనిపై మార్గదర్శకాలు రాబోతున్నాయి. ఈలోపు కరోనా ఉద్దృతి తీవ్ర స్థాయిలో ఉన్న మహారాష్ట్రలో షూటింగులకు అనుమతులు లభించడం విశేషం. బాలీవుడ్కు కేంద్రం అయిన ముంబయిలో షూటింగ్స్ పునఃప్రారంభం కానున్నాయి. కొన్ని షరతులు పాటిస్తూ షూటింగులు జరుపుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
అయితే, సినిమాలకు సంబంధించి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు షూటింగ్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతులు ఇస్తూనే కొన్ని షరతులు విధించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం షూటింగ్లు జరిగే చోట తప్పకుండా అందరూ భౌతిక దూరం పాటించాలి. ఆ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుండాలి. అదే విధంగా నటీనటులు మేకప్మెన్లను పెట్టుకోకుండా సొంతంగానే మేకప్లు వేసుకోవాల్సి ఉంటుంది.
ఇక షూటింగ్లో భాగంగా ముద్దులు, కౌగిలింతలు నిషేధం. ఫైట్ సన్నివేశాలు కూడా ఇప్పుడు నివారించాలని సూచించారు. ఇప్పట్లో ఈ సన్నివేశాలకు అవకాశం లేదు. అదే విధంగా పెళ్లి సన్నివేశాలు, మార్కెట్ తరహా రద్దీగా కనిపించే సీన్స్కు కూడా అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు కట్టుబడి జాగ్రత్తగా షూటింగ్లు మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. దాదాపు ఇవే మార్గదర్శకాల్ని మిగతా రాష్ట్రాలూ సూచించే అవకాశముంది.
This post was last modified on June 2, 2020 1:51 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…