Movie News

మనోజ్‌ బాజ్‌పాయ్ ఇంట తీవ్ర విషాదం!

బాలీవుడ్ తో పాటు నటుడిగా కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కనిపించారు మనోజ్‌ బాజ్‌పాయ్. సినిమాలతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2019లో విడుదల కాగా.. రెండో సీజన్ ఈ ఏడాది జూన్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సమంత కీలకపాత్ర పోషించింది. ఇదిలా ఉండగా.. తాజాగా మనోజ్‌ బాజ్‌పాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

ఆయన తండ్రి ఆర్కే బాజ్‌పాయ్(83) ఆదివారం నాడు కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన్ను ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ ఆదివారం నాడు కన్నుమూశారు. షూటింగ్ కోసం కేరళ వెళ్లిన మనోజ్ బాజ్‌పాయ్ తండ్రి మరణవార్త తెలుసుకొని ఢిల్లీకి వెళ్లారు. ఈ సమయంలో తనకు, తన కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని మీడియాను కోరారు మనోజ్ బాజ్‌పాయ్.

మనోజ్ కి తన తండ్రితో మంచి అనుబంధం ఉంది. కొడుకు ఉన్నత చదువులు చదవాలని ఆయన ఆశ పడేవారని.. ఆయన కోసం ఢిల్లీ యూనివర్సిటీలో చేరి డిగ్రీ పట్టాపొందానని గతంలో మనోజ్ చెప్పారు. అలానే తండ్రి చాలా బాగా వంట చేస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టేవారు. మనోజ్ బాజ్‌పాయ్ తండ్రి మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

This post was last modified on October 3, 2021 5:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

7 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

9 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

38 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago