బాలీవుడ్ తో పాటు నటుడిగా కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కనిపించారు మనోజ్ బాజ్పాయ్. సినిమాలతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2019లో విడుదల కాగా.. రెండో సీజన్ ఈ ఏడాది జూన్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సమంత కీలకపాత్ర పోషించింది. ఇదిలా ఉండగా.. తాజాగా మనోజ్ బాజ్పాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
ఆయన తండ్రి ఆర్కే బాజ్పాయ్(83) ఆదివారం నాడు కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన్ను ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ ఆదివారం నాడు కన్నుమూశారు. షూటింగ్ కోసం కేరళ వెళ్లిన మనోజ్ బాజ్పాయ్ తండ్రి మరణవార్త తెలుసుకొని ఢిల్లీకి వెళ్లారు. ఈ సమయంలో తనకు, తన కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని మీడియాను కోరారు మనోజ్ బాజ్పాయ్.
మనోజ్ కి తన తండ్రితో మంచి అనుబంధం ఉంది. కొడుకు ఉన్నత చదువులు చదవాలని ఆయన ఆశ పడేవారని.. ఆయన కోసం ఢిల్లీ యూనివర్సిటీలో చేరి డిగ్రీ పట్టాపొందానని గతంలో మనోజ్ చెప్పారు. అలానే తండ్రి చాలా బాగా వంట చేస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టేవారు. మనోజ్ బాజ్పాయ్ తండ్రి మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
This post was last modified on October 3, 2021 5:26 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…