Movie News

మనోజ్‌ బాజ్‌పాయ్ ఇంట తీవ్ర విషాదం!

బాలీవుడ్ తో పాటు నటుడిగా కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కనిపించారు మనోజ్‌ బాజ్‌పాయ్. సినిమాలతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2019లో విడుదల కాగా.. రెండో సీజన్ ఈ ఏడాది జూన్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సమంత కీలకపాత్ర పోషించింది. ఇదిలా ఉండగా.. తాజాగా మనోజ్‌ బాజ్‌పాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

ఆయన తండ్రి ఆర్కే బాజ్‌పాయ్(83) ఆదివారం నాడు కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన్ను ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ ఆదివారం నాడు కన్నుమూశారు. షూటింగ్ కోసం కేరళ వెళ్లిన మనోజ్ బాజ్‌పాయ్ తండ్రి మరణవార్త తెలుసుకొని ఢిల్లీకి వెళ్లారు. ఈ సమయంలో తనకు, తన కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని మీడియాను కోరారు మనోజ్ బాజ్‌పాయ్.

మనోజ్ కి తన తండ్రితో మంచి అనుబంధం ఉంది. కొడుకు ఉన్నత చదువులు చదవాలని ఆయన ఆశ పడేవారని.. ఆయన కోసం ఢిల్లీ యూనివర్సిటీలో చేరి డిగ్రీ పట్టాపొందానని గతంలో మనోజ్ చెప్పారు. అలానే తండ్రి చాలా బాగా వంట చేస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టేవారు. మనోజ్ బాజ్‌పాయ్ తండ్రి మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

This post was last modified on October 3, 2021 5:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

3 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

4 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

5 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

5 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

6 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

7 hours ago