ఒకప్పటితో పోలిస్తే ఈ తరం ప్రేక్షకుల్లో ‘క్లాస్’ టచ్ ఉన్న సినిమాల్ని ఇష్టపడేవాళ్లే ఎక్కువ కానీ.. మాస్ ప్రేక్షకులను ఎప్పుడూ విస్మరించడానికి వీల్లేదు. వాళ్లను పూర్తిగా మెప్పించే సినిమాలు తీసే దర్శకులు ఇప్పుడు తగ్గిపోయారు. ఆ తక్కువమందిలో బోయపాటి శ్రీను ఒకడు. ఆయన చిత్రాల్లో యాక్షన్కు ఉండే ప్రాధాన్యం ఎలాంటిదో తెలిసిందే. హీరోను ఎంతో బలవంతుడిగా చూపిస్తూనే.. అతడికి దీటుగా అత్యంత క్రూరమైన విలన్ని పెడుతుంటాడు బోయపాటి.
సింహా, లెజెండ్, సరైనోడు లాంటి చిత్రాల్లో విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటాయో తెలిసిందే. బోయపాటి కొత్త చిత్రం ‘అఖండ’లోనూ విలన్ పాత్ర మామూలుగా ఉండదని అంటున్నాడు ఆ క్యారెక్టర్ను పోషించిన సీనియర్ నటుడు. ‘అఖండ’లో తన పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని.. ఆ పాత్ర లుక్, దాని పాత్ర చిత్రణ చాలా భయంకరంగా ఉంటాయని శ్రీకాంత్ తెలిపాడు.
“ఇంతకు ముందు బాలయ్యతో ‘శ్రీరామ రాజ్యం’లో తమ్ముడిగా చేశాను. ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్గా, పవర్ ఫుల్గా ఉండే రోల్లో కనిపించనున్నా. ‘అఖండ’లో నేను చేస్తున్నది విలన్ పాత్రే. ఆ క్యారెక్టర్లో చాలా కొత్తగా కనబడతా. అసలు ఎవరూ కూడా ఊహించరు నేను అలా ఉంటానని. గెటప్ అంత భిన్నంగా ఉంటుంది. ముంబయి నుంచి ఎన్నో డిజైన్స్ చేయించి ఫైనల్గా ఒకటి బోయపాటి ఫిక్స్ చేశారు. పాత్ర చాలా రఫ్గా, క్రూరంగా ఉంటుంది. ఆ పాత్రను చూశాక ప్రేక్షకులు నన్ను తిడతారేమో అని కూడా అనిపించింది. బాలయ్య గారు మళ్ళీ ఇలాంటి రోల్ చెయ్యొద్దని నాతో అన్నారు. ఆ రేంజ్లో ఈ రోల్ ఉంటుంది. ఇక దీని తర్వాత భయంకరంగా ఆఫర్స్ వస్తాయి అందుకే జాగ్రత్తగా ఉండమని నాకు చెప్పారు. అది జాగ్రత్త చెప్పడం మాత్రమే” అని శ్రీకాంత్ అన్నాడు.
మొత్తానికి శ్రీకాంత్ చెబుతున్న తీరు చూస్తే ‘అఖండ’లో అతడి పాత్ర ఓ రేంజిలో ఉండేలా ఉంది. మరి ‘లెజెండ్’తో విలన్ అవతారమెత్తిన జగపతిబాబు ఫుల్ బిజీ అయిపోయినట్లే.. శ్రీకాంత్ కూడా ఆఫర్లలో తడిసి ముద్దవుతాడేమో చూడాలి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…