భారతీయ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్బస్టర్గా సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో అత్యంత కీలకంగా నిలిచిన శివగామి పాత్రను ఆధారంగా చేసుకుని రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ ఆధారంగా హాలీవుడ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహాలో ఇండియాలో ఒక భారీ సిరీస్ తీయాలని నాలుగేళ్ల కిందట నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు మొదలుపెట్టింది. కానీ ఒక పట్టాన ఈ సిరీస్ పట్టాలెక్కలేదు. టాలీవుడ్ దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు ఈ ప్రాజెక్టు కోసం కొంత కాలం పని చేసి.. ఏవో కారణాల వల్ల దాని నుంచి తప్పుకోవడం తెలిసిందే.
తర్వాత వేరే టీంను పెట్టుకుని సరికొత్తగా బాహుబలి సిరీస్ తీయడానికి సిద్ధమవుతోంది నెట్ ఫ్లిక్స్. ఇందులో నయనతార, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఐతే ఈ సిరీస్ నుంచి దేవా, ప్రవీణ్ ఎందుకు బయటికి వచ్చేశారన్నది వెల్లడి కాలేదు. నెట్ ఫ్లిక్స్ వాళ్లకు వీళ్ల పనితీరు నచ్చలేదని.. లేదు వీళ్లే ఆ ప్రాజెక్టు తమకు కాదని బయటికి వచ్చేశారని.. ఇలా రకరకాల వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పుడు దేవా కట్టా స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. తన కొత్త చిత్రం ‘రిపబ్లిక్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన దేవా.. నెట్ ఫ్లిక్స్ సిరీస్కు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో వెల్లడించాడు.
“బాహుబలి సిరీస్ ముఖ్యోద్దేశం ఇండియాలో ఒక ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాగా ఉండాలనే. ఐతే అలాంటి గొప్ప ప్రాజెక్టు ఒకరిద్దరు దర్శకులతో ఒకట్రెండు సంవత్సరాల్లో చేసేది కాదు. దానికి చాలా సమయం వెచ్చించాలి. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కథను దాదాపు పదేళ్లు రాశారు. స్క్రీన్ ప్లే కోసం కూడా అంత సమయం పెట్టారు. సిరీస్ తీశారు. ఆపేశారు. మళ్లీ తీశారు. అలా ఎంతో క్లారిటీగా చేశారు. ఆ లెవల్ టీమ్ టెక్నీషియన్స్, టైమ్, ఇన్వెస్ట్ చేస్తేనే ఔట్పుట్ వస్తుందని భావించి.. మా జీవితాన్నంతా ఆ సిరీస్ కోసమే వెచ్చించలేమని అర్థం చేసుకుని రాసిందంతా అక్కడే పెట్టేసి ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాం. ఓ సీజన్ను రాసుకుని తీసే ప్రాజెక్ట్ అది కాదు. కాస్త షూట్ చేసినా కూడా పక్కకు వచ్చేశాం” అని దేవా చెప్పాడు. దీన్ని బట్టి నెట్ ఫ్లిక్స్ వాళ్లు తీసేయడం కాదు.. దేవా, ప్రవీణ్లే ఈ ప్రాజెక్ట్ సెట్టవదని బయటికొచ్చేశారన్నమాట.
This post was last modified on September 30, 2021 1:41 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…