మొన్న ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్.. సినిమా పరిశ్రమ మంచి కోసమే గళం విప్పారు. తనను టార్గెట్ చేసే క్రమంలో కొన్ని నెలల నుంచి టాలీవుడ్ వ్యతిరేక నిర్ణయాలతో మొత్తం సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతోందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ వ్యాఖ్యలు.. ఆయన ప్రశ్నలు సహేతుకమైనవే అన్నది మెజారిటీ అభిప్రాయం.
ఈ నేపథ్యంలో పవన్కు మద్దతుగా ఇండస్ట్రీ నుంచి గళాలు వినిపిస్తాయని అనుకుంటే.. నాని, కార్తికేయ, సంపూర్ణేష్ బాబు లాంటి ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే ఎవరూ మాట్లాడలేదు. ఐతే సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో పవన్ను వెనకేసుకు రావడం ద్వారా.. లేదంటే ప్రభుత్వంపై విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని చాలామంది భావించి ఉండొచ్చు. పవన్ వ్యాఖ్యల్లో రాజకీయ కోణం ఉండటంతో ఈ వివాదంలో వేలు పెట్టి తాము ఇబ్బంది పడటం ఎందుకు అనుకుని ఉండొచ్చు. ఆ సంగతి వదిలేద్దాం.
కానీ తాజాగా పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు మాత్రం దారుణం. పవన్ భార్యా పిల్లల్ని వివాదంలోకి లాగి దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేశారు పోసాని. పవన్ ఒక రాజకీయ నాయకుడు అన్నది పక్కన పెడితే.. సినిమా పరిశ్రమ వ్యక్తి. ఒక సహ నటుడి గురించి పోసాని ఇంత దిగజారి మాట్లాడటం ఎంతమాత్రం సహేతుకం కాదు. ఏ రకంగానూ ఈ వ్యాఖ్యల్ని సమర్థించుకోవడానికి వీల్లేదు. మరి ఈ వ్యాఖ్యల్ని ఖండించడానికి సినీ జనాలకు ఏం ఇబ్బందన్నది అర్థం కాని విషయం.
ఎవరో అభిమానులు తనను, తన భార్యను తిడితే దానికి పవన్ను బాధ్యుణ్ని చేసి బూతులు తిట్టడం.. భార్య, బిడ్డ గురించి అంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్? ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తే అది రాజకీయాల్లో జోక్యం చేసుకున్నట్లు కాదు. ప్రభుత్వంతో అసలేమాత్రం సంబంధం లేని విషయమిది. ఈ వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో కూడా పవన్కు మద్దతుగా పరిశ్రమ నిలవకపోవడం, పోసాని వ్యాఖ్యల్ని ఖండించకపోవడం ఏమిటో అర్థం కాని విషయం. ఇది చూసి సినీ జనాలు మరీ ఇంత పిరికి వాళ్లా అని జనం ఆశ్చర్యపోతుండటంలో ఆశ్చర్యమేముంది?
This post was last modified on September 30, 2021 8:25 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…