Movie News

బన్నీ సినిమా క్రిస్మస్ కి రానట్లే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లే సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. ఈ క్రమంలో ‘దాక్కో దాక్కో మేక’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. త్వరలోనే మరో సాంగ్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ‘పుష్ప’ సినిమా క్రిస్మస్ కి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.

నిజానికి ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని సెప్టెంబర్ లోపు పూర్తి చేసి.. మిగిలిన ప్యాచ్ వర్క్ చేసుకొని డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదీ జరగడం లేదట. మరో నెల రోజులకు పైగా చేయాల్సిన షూటింగ్ పెండింగ్ ఉందట. ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అది కాకుండా మరో రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వీటితో పాటు యాక్షన్స్ సన్నివేశాలను కూడా చిత్రీకరించాల్సివుంది.

ఎలా చూసుకున్నా.. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేసరికి నవంబర్ వచ్చేస్తుంది. అందుకే మేకర్స్ మరో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. రష్మిక మందనా హీరోయిన్ నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు.

This post was last modified on September 28, 2021 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

3 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

4 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

4 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

4 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

6 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

7 hours ago