స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లే సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. ఈ క్రమంలో ‘దాక్కో దాక్కో మేక’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. త్వరలోనే మరో సాంగ్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ‘పుష్ప’ సినిమా క్రిస్మస్ కి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.
నిజానికి ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని సెప్టెంబర్ లోపు పూర్తి చేసి.. మిగిలిన ప్యాచ్ వర్క్ చేసుకొని డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదీ జరగడం లేదట. మరో నెల రోజులకు పైగా చేయాల్సిన షూటింగ్ పెండింగ్ ఉందట. ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అది కాకుండా మరో రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వీటితో పాటు యాక్షన్స్ సన్నివేశాలను కూడా చిత్రీకరించాల్సివుంది.
ఎలా చూసుకున్నా.. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేసరికి నవంబర్ వచ్చేస్తుంది. అందుకే మేకర్స్ మరో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. రష్మిక మందనా హీరోయిన్ నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు.
This post was last modified on September 28, 2021 2:28 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…