స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లే సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. ఈ క్రమంలో ‘దాక్కో దాక్కో మేక’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. త్వరలోనే మరో సాంగ్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ‘పుష్ప’ సినిమా క్రిస్మస్ కి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.
నిజానికి ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని సెప్టెంబర్ లోపు పూర్తి చేసి.. మిగిలిన ప్యాచ్ వర్క్ చేసుకొని డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదీ జరగడం లేదట. మరో నెల రోజులకు పైగా చేయాల్సిన షూటింగ్ పెండింగ్ ఉందట. ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అది కాకుండా మరో రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వీటితో పాటు యాక్షన్స్ సన్నివేశాలను కూడా చిత్రీకరించాల్సివుంది.
ఎలా చూసుకున్నా.. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేసరికి నవంబర్ వచ్చేస్తుంది. అందుకే మేకర్స్ మరో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. రష్మిక మందనా హీరోయిన్ నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి…
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…