కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యంత హైప్ తెచ్చుకున్న ‘లవ్ స్టోరి’ మూవీ గత వారాంతంలోనే విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టుకుంది. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఒకప్పటిలా కళకళలాడాయి. డివైడ్ టాక్, బంద్, వర్షాల కారణంగా వీకెండ్ తర్వాత జోరు ఈ సినిమా జోరు బాగా తగ్గింది.
దీంతో ఇక ఫోకస్ ఆటోమేటిగ్గా ఈ వారాంతంలో విడుదల కానున్న ‘రిపబ్లిక్’ మీదికి మళ్లుతోంది. ఐతే ఈ సినిమాకు ఇప్పటిదాకా అయితే అనుకున్నంత హైప్ లేదు. బేసిగ్గా ఇది సీరియస్ మూవీ కావడం కొంత మైనస్సే. సామాజిక, రాజకీయ అంశాల చుట్టూ దేవా కట్టా చాలా సిన్సియర్గా ఈ సినిమా తీసినట్లున్నాడు.
ఐతే కంటెంట్ మరీ సీరియస్గా ఉండటంతో యువ ప్రేక్షకుల్లో అంత ఆసక్తి కనిపించడం లేదు. ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేసి సినిమాకు హైప్ పెంచాల్సిన టైంలో హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కారణంగా ఆసుపత్రికి పరిమితం కావడం మైనస్ అయింది.
ఐతే ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్ కొంచెం గట్టిగా చేసి హైప్ పెంచాలనుకున్నారు. ఇందుకోసమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ముఖ్య అతిథిగా పిలిపించారు కూడా. కానీ ఆయన ఆ వేడుకలో పూర్తిగా రాజకీయాల మీద మాట్లాడి ఫోకస్ మళ్లించేశాడు. ఈ వేడుక అయ్యేసరికి అందరూ ‘రిపబ్లిక్’ గురించి మరిచిపోయారు.
పూర్తిగా పవన్ చేసిన రాజకీయ వ్యాఖ్యల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీంతో సినిమా పక్కకు వెళ్లిపోయింది. ఈ వేడుకకు పవన్ ప్లస్ అవుతాడనుకుంటే.. ఈ వేడుకే పవన్కు ప్లస్ అయింది. పవన్ వల్ల సినిమాకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ మీడియాను కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ఎంతైనా ఒక సినిమా రిలీజ్ ముంగిట దాని హీరో మీడియా ముందుకొస్తే వచ్చే హైప్ వేరని రుజువవుతోంది.
యాక్సిడెంట్ తర్వాత తేజు ఈపాటికి కోలుకుని మీడియాను కలిసి ఉంటే మీడియా దృష్టి మొత్తం అతడి చుట్టూ, తన సినిమా చుట్టూ తిరిగేది. అతను లేకపోడవడం మైనస్ అవుతోంది. మరి లో బజ్తో రిలీజవుతున్న ‘రిపబ్లిక్’ ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.
This post was last modified on September 28, 2021 2:40 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…