పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు బెయిల్ కి అప్లై చేయగా.. రెండు, మూడు సార్లు రిజెక్ట్ చేసిన కోర్టు ఫైనల్ గా అతడికి బెయిల్ మంజూరు చేసింది. రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన వెంటనే శిల్పాశెట్టి వైవాహిక జీవితానికి సంబంధించి చాలా రూమర్లు వినిపించాయి. వాటికి మరింత బలం చేకూరుస్తూ అప్పట్లో శిల్పాశెట్టి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టే పోస్ట్ లు, సింగిల్ మదర్ గా కొనసాగే ఆర్థిక స్తోమత, ధైర్యం రెండూ తనకు ఉన్నాయని చెప్పడం అనుమానాలకు దారి తీసింది.
దీంతో ఆమె రాజ్ కుంద్రా నుంచి విడిపోతుందని కథనాలను ప్రచురించారు. అయితే శిల్పాశెట్టి తన భర్త నుంచి విడిపోవడం లేదని తెలుస్తోంది. తామిద్దరం ఎప్పటిలానే అన్యోన్యంగా కలిసి ఉంటున్నామని.. ఈ మధ్య జరిగిన కొన్ని ఊహించని పరిణామాల వలన తమ మధ్య అనుబంధం మరింత పెరిగిందని అంటోంది శిల్పాశెట్టి.
భర్త నుంచి విడిపోయే ఆలోచనల వలనే.. శిల్పాశెట్టి బాలీవుడ్ లో బిజీ అవ్వాలనుకుంటుందని వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేసింది. కొన్ని విషయాలను మర్చిపోవాలంటే పనిలో పడిపోవాలని.. ప్రస్తుతం తను అదే పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. బెయిల్ పై బయటకొచ్చిన రాజ్ కుంద్రా.. తన భార్యతోనే కలిసి ఉంటున్నారు. రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వడంతో శిల్పాశెట్టి బ్రాండ్ వాల్యూ బాగా పడిపోయింది. కోట్లలో తన ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పుడు తిరిగి తన బ్రాండ్ వాల్యూని పెంచుకునే పనిలో పడింది శిల్పాశెట్టి.
This post was last modified on September 27, 2021 1:54 pm
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…