Movie News

భర్తతో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన శిల్పాశెట్టి!

పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు బెయిల్ కి అప్లై చేయగా.. రెండు, మూడు సార్లు రిజెక్ట్ చేసిన కోర్టు ఫైనల్ గా అతడికి బెయిల్ మంజూరు చేసింది. రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన వెంటనే శిల్పాశెట్టి వైవాహిక జీవితానికి సంబంధించి చాలా రూమర్లు వినిపించాయి. వాటికి మరింత బలం చేకూరుస్తూ అప్పట్లో శిల్పాశెట్టి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టే పోస్ట్ లు, సింగిల్ మదర్ గా కొనసాగే ఆర్థిక స్తోమత, ధైర్యం రెండూ తనకు ఉన్నాయని చెప్పడం అనుమానాలకు దారి తీసింది.

దీంతో ఆమె రాజ్ కుంద్రా నుంచి విడిపోతుందని కథనాలను ప్రచురించారు. అయితే శిల్పాశెట్టి తన భర్త నుంచి విడిపోవడం లేదని తెలుస్తోంది. తామిద్దరం ఎప్పటిలానే అన్యోన్యంగా కలిసి ఉంటున్నామని.. ఈ మధ్య జరిగిన కొన్ని ఊహించని పరిణామాల వలన తమ మధ్య అనుబంధం మరింత పెరిగిందని అంటోంది శిల్పాశెట్టి.

భర్త నుంచి విడిపోయే ఆలోచనల వలనే.. శిల్పాశెట్టి బాలీవుడ్ లో బిజీ అవ్వాలనుకుంటుందని వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేసింది. కొన్ని విషయాలను మర్చిపోవాలంటే పనిలో పడిపోవాలని.. ప్రస్తుతం తను అదే పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. బెయిల్ పై బయటకొచ్చిన రాజ్ కుంద్రా.. తన భార్యతోనే కలిసి ఉంటున్నారు. రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వడంతో శిల్పాశెట్టి బ్రాండ్ వాల్యూ బాగా పడిపోయింది. కోట్లలో తన ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పుడు తిరిగి తన బ్రాండ్ వాల్యూని పెంచుకునే పనిలో పడింది శిల్పాశెట్టి.

This post was last modified on September 27, 2021 1:54 pm

Share
Show comments

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

48 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

3 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

5 hours ago