పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు బెయిల్ కి అప్లై చేయగా.. రెండు, మూడు సార్లు రిజెక్ట్ చేసిన కోర్టు ఫైనల్ గా అతడికి బెయిల్ మంజూరు చేసింది. రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన వెంటనే శిల్పాశెట్టి వైవాహిక జీవితానికి సంబంధించి చాలా రూమర్లు వినిపించాయి. వాటికి మరింత బలం చేకూరుస్తూ అప్పట్లో శిల్పాశెట్టి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టే పోస్ట్ లు, సింగిల్ మదర్ గా కొనసాగే ఆర్థిక స్తోమత, ధైర్యం రెండూ తనకు ఉన్నాయని చెప్పడం అనుమానాలకు దారి తీసింది.
దీంతో ఆమె రాజ్ కుంద్రా నుంచి విడిపోతుందని కథనాలను ప్రచురించారు. అయితే శిల్పాశెట్టి తన భర్త నుంచి విడిపోవడం లేదని తెలుస్తోంది. తామిద్దరం ఎప్పటిలానే అన్యోన్యంగా కలిసి ఉంటున్నామని.. ఈ మధ్య జరిగిన కొన్ని ఊహించని పరిణామాల వలన తమ మధ్య అనుబంధం మరింత పెరిగిందని అంటోంది శిల్పాశెట్టి.
భర్త నుంచి విడిపోయే ఆలోచనల వలనే.. శిల్పాశెట్టి బాలీవుడ్ లో బిజీ అవ్వాలనుకుంటుందని వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేసింది. కొన్ని విషయాలను మర్చిపోవాలంటే పనిలో పడిపోవాలని.. ప్రస్తుతం తను అదే పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. బెయిల్ పై బయటకొచ్చిన రాజ్ కుంద్రా.. తన భార్యతోనే కలిసి ఉంటున్నారు. రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వడంతో శిల్పాశెట్టి బ్రాండ్ వాల్యూ బాగా పడిపోయింది. కోట్లలో తన ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పుడు తిరిగి తన బ్రాండ్ వాల్యూని పెంచుకునే పనిలో పడింది శిల్పాశెట్టి.
This post was last modified on September 27, 2021 1:54 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…