టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఓ భారీ చిత్రంతో హిందీలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆ చిత్రమే.. లాల్ సింగ్ చద్దా. ఇందులో అరగంటకు పైగా నిడివి ఉన్న ప్రత్యేక పాత్రను చేస్తున్నాడు నాగచైతన్య. ఇందుకోసం నెలన్నర పాటు షూటింగ్లో పాల్గొని వచ్చాడు.
ఇందులో అతను చేస్తున్నది సైనికుడి పాత్ర అన్నది రివీలైంది. ఈ పాత్రకు సంబంధించి మొత్తం లడ్డక్లో చిత్రీకరణ జరిగింది. ఇందులో చైతన్య పాత్రకు ఆసక్తికరమైన పేరు పెట్టారు. ఆ పేరు అక్కినేని అభిమానులను ఎమోషనల్గా కనెక్ట్ చేసేదే. తన పాత్ర పేరు బాలరాజు అట.
ఈ పేరుతో అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ ఆరంభంలో ఒక క్లాసిక్ మూవీ చేశాడు. ఆయన పూర్తి స్థాయిలో కథానాయకుడిగా నటించిన తొలి చిత్రమిది. దీని గురించి ఎప్పుడు మాట్లాడినా ఎగ్జైట్ అయ్యేవారు ఏఎన్నార్.
ఇప్పుడు ఏఎన్నార్ కెరీర్లో మరపురాని పాత్ర పేరును చైతూ పాత్రకు పెట్టడం.. అందులోనూ అది హిందీ డెబ్యూ మూవీ కావడంతో చైతూ కంటే కంటే అతడి తండ్రి నాగార్జున చాలా ఎగ్జైట్ అవుతున్నట్లు.. భావోద్వేగానికి గురవుతున్నట్లు సమాచారం. ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూ పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ చిత్రం హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
ఒరిజినల్లో ‘బబ్బా’ అనే ఆసక్తికరమైన పాత్ర ఉంటుంది. సైన్యంలోకి అడుగు పెట్టిన హీరోకు అక్కడ దొరికే ఏకైక స్నేహితుడు బబ్బానే. కాస్త చిత్రమైన హావభావాలతో అమాయకంగా కనిపిస్తాడు. అతడి కంపెనీని హీరో ఎంతో ఇష్టపడతాడు. ఆర్మీ నుంచి రిటైరయ్యాక పెద్ద ఓడ కొనుక్కుని దాని ద్వారా సముద్రంలో చేపలు పట్టాలన్నది అతడి కల. కానీ అతడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుంది. ఈ సన్నివేశాలు చాలా హృద్యంగా ఉంటాయి.
హీరో సైన్యం నుంచి నిష్క్రమించాక బబ్బా కలను నెరవేరుస్తాడు. సినిమాలో ఈ పాత్ర ఉండేది అటు ఇటుగా అరగంటే కానీ.. దాని ఇంపాక్ట్ మాత్రం సినిమా అంతా కొనసాగుతుంది. చైతూ ఈ పాత్రలోనే నటిస్తున్నాడని తెలుస్తోంది.
This post was last modified on September 26, 2021 10:36 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…