Movie News

‘సర్కారు వారి పాట’ ఎక్కడిదాకా వచ్చింది?

తెలుగు ప్రేక్షకుల్లో అత్యధిక అంచనాలున్న భారీ చిత్రాల్లో ‘సర్కారు వారి పాట’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇప్పటిదాకా మీడియం రేంజ్ సినిమాలకే పరిమితం అయిన పరశురామ్.. తొలిసారి ఓ పెద్ద స్టార్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ లాంటి పెద్ద సంస్థలు కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. ఇంకా చాలా ప్రత్యేకతలే ఉన్నాయీ సినిమాకు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా గత నెలలో రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం అయితే ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలి. సినిమా మొదలైనపుడే సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించారు. ఐతే మధ్యలో కరోనా సెకండ్ వేవ్ వల్ల రెండు నెలలకు పైగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి రిలీజ్ ఖాయమేనా అన్న సందేహాలు కలిగాయి.

కానీ టీజర్ లాంచ్ సందర్భంగా సంక్రాంతి విడుదల పక్కా అని నొక్కి వక్కాణించారు. మరి షూటింగ్ ఎంత దాకా వచ్చింది, ఔట్ పుట్ ఎంత సంతృప్తికరంగా ఉంది అనే విషయాల్లో ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు. ఈ విషయమై మహేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా చిత్రీకరణ 60 నుంచి 70 శాతం వరకు పూర్తయిందని అతను వెల్లడించాడు. ఇప్పటిదాకా వచ్చిన రషెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని.. అభిమానులు ఈ సినిమాలో కొత్త మహేష్‌ను చూస్తారని సూపర్ స్టార్ అన్నాడు.

ఈ చిత్రాన్ని ఒకే సిట్టింగ్‌లో, తక్కువ సమయంలో తాను అంగీకరించానని.. తన కెరీర్లో ఇది మరో ‘పోకిరి’ అవుతుందని మహేష్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక రాజమౌళితో తాను చేయాల్సిన సినిమా గురించి మహేష్ మాట్లాడుతూ.. ఆయనతో సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నానని.. తన కల నెరవేరుతున్నట్లు అనిపిస్తోందని.. ఈ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడ్డం తొందరపాటు అవుతుందని, సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పాడు.

This post was last modified on September 26, 2021 1:53 am

Share
Show comments

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

7 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

8 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

10 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

11 hours ago