రచయితలు ఎన్నో కథలు రాస్తుంటారు. దర్శకులు కూడా ఎన్నో కథలు వండుతుంటారు. వండిస్తుంటారు. అలాగే హీరోలు ఎన్నో కథలు వింటుంటారు. ఐతే చివరికి ఓకే అయి పట్టాలెక్కే కథలు కొన్నే ఉంటాయి. అలా ఎంపిక అయ్యే కథ ఏదన్నది అత్యంత కీలకం. ఏ దశలో ఎవరి ఛాయిస్ తేడా కొట్టినా.. అంతే సంగతులు. దాన్ని బట్టే సినిమా హిట్టో ఫట్టో నిర్ణయం అవుతుంది. మహేష్ బాబు కెరీర్లో అతి పెద్ద హిట్లలో ఒకటైన ‘దూకుడు’ సినిమా విషయానికి వస్తే.. ఆ సమయానికి మహేష్, శ్రీను వైట్ల చేయాల్సిన కథ ఇది కాదట. వీరి కలయికలో సినిమా అనుకున్నాక ముందు ఎంచుకున్న కథ వేరట.
2006లో విడుదలైన ‘రంగ్ దె బసంతి’ చూశాక మహేష్ కోసం దేశభక్తితో ముడిపడ్డ ఓ కథను అనుకున్నామని.. అది ఓకే అనుకుని దాని మీద దాదాపు ఐదు నెలల పాటు పని చేశామని.. 80 శాతం స్క్రిప్టు కూడా పూర్తి అయ్యాక.. ఆ కథ మీద సందేహాలు కలిగాయని.. దీంతో దాన్ని పక్కన పెట్టేశామని తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీను వైట్ల వెల్లడించాడు.
ఆ సమయంలో మహేష్ను ఎమ్మెల్యేగా చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి ‘దూకుడు’ కథ పుట్టిందని.. దాన్ని డెవలప్ చేసి.. పక్కాగా స్క్రిప్టు రెడీ చేసి సినిమాను పట్టాలెక్కించామని శ్రీను వైట్ల తెలిపాడు. ప్రకాష్ రాజ్ చేసిన పాత్రను మాజీ ఎమ్మెల్యే పి.జనార్ధనరెడ్డి స్ఫూర్తితో తీర్చిదిద్దామని.. ఈ పాత్రను శ్రీహరితో చేయించాలనుకున్నామని.. కానీ కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో ప్రకాష్ రాజ్తో చేయించామని శ్రీను తెలిపాడు.
ఇదిలా ఉండగా.. తన చివరి సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత స్వతహాగానే కొంచెం గ్యాప్ వచ్చిందని, దీనికి తోడు కరోనా కారణంగా విరామం పెరిగిందని.. ఈ సమయంలో తన రైటింగ్ టీంతో కలిసి మూడు కథలు రెడీ చేశానని.. అవి మూడూ వినోద ప్రధానంగా సాగేవే అని.. అందులో ఒకటి ‘ఢీ అండ్ ఢీ’గా రాబోతోందని.. ఈ సినిమా ‘ఢీ’కి సీక్వెల్ కాదని.. కానీ ఆ చిత్రం మాదిరే పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని వైట్ల చెప్పాడు.
This post was last modified on September 23, 2021 1:27 pm
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…