కొన్నేళ్ల పాటు ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ సహ యజమానిగా మంచి హోదా అనుభవించి.. ఆ తర్వాత కూడా ప్రముఖ వ్యాపారవేత్తగా చెలామణి అవుతూ వచ్చిన రాజ్ కుంద్రా.. కొన్ని నెలల కిందట పోర్న్ మూవీస్ తీస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్టవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న రాజ్.. సోమవారమే కోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. కాగా అతను బెయిల్ మీద వచ్చిన సమయంలోనే ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తన గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు.
విచారణలో భాగంగా రాజ్కుంద్రా ఫోన్, లాప్టాప్, హాట్డ్రైవ్ డిస్క్లను పరిశీలించామని.. వాటిల్లో మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఆ వీడియోలన్నింటినీ కలిపి రాజ్ కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్లు కూడా తెలిపారు. ఏకంగా 100 ప్లస్ సంఖ్యలో పోర్న్ సినిమాలు నిర్మించాడంటే.. రాజ్ ఏ స్థాయిలో ఈ దందాను నడుపుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. తాము నిర్మించినవి పోర్న్ సినిమాలు కావని.. కొంచెం శృంగారభరితంగా ఉన్న వీడియోలు మాత్రమే అని రాజ్ సమర్థించుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబయి శివారులోని ‘మాద్ దీవి’లోని ఓ బంగ్లాలో పోర్న్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి ‘పోర్న్ రాకెట్’ గుట్టుని బయటపెట్టారు. ఇందులో భాగంగానే ‘హాట్ షాట్స్’ యాప్ నిర్వహిస్తున్న రాజ్కుంద్రాను అరెస్ట్ చేశారు. కుంద్రా వ్యవహారాల గురించి తనకు ఏమీ తెలియదని అంటున్న అతడి భార్య శిల్పా శెట్టి.. తాజా పరిణామాల నేపథ్యంలో అతడి నుంచి విడిపోవాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 21, 2021 4:49 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…