కొన్నేళ్ల పాటు ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ సహ యజమానిగా మంచి హోదా అనుభవించి.. ఆ తర్వాత కూడా ప్రముఖ వ్యాపారవేత్తగా చెలామణి అవుతూ వచ్చిన రాజ్ కుంద్రా.. కొన్ని నెలల కిందట పోర్న్ మూవీస్ తీస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్టవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న రాజ్.. సోమవారమే కోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. కాగా అతను బెయిల్ మీద వచ్చిన సమయంలోనే ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తన గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు.
విచారణలో భాగంగా రాజ్కుంద్రా ఫోన్, లాప్టాప్, హాట్డ్రైవ్ డిస్క్లను పరిశీలించామని.. వాటిల్లో మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఆ వీడియోలన్నింటినీ కలిపి రాజ్ కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్లు కూడా తెలిపారు. ఏకంగా 100 ప్లస్ సంఖ్యలో పోర్న్ సినిమాలు నిర్మించాడంటే.. రాజ్ ఏ స్థాయిలో ఈ దందాను నడుపుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. తాము నిర్మించినవి పోర్న్ సినిమాలు కావని.. కొంచెం శృంగారభరితంగా ఉన్న వీడియోలు మాత్రమే అని రాజ్ సమర్థించుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబయి శివారులోని ‘మాద్ దీవి’లోని ఓ బంగ్లాలో పోర్న్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి ‘పోర్న్ రాకెట్’ గుట్టుని బయటపెట్టారు. ఇందులో భాగంగానే ‘హాట్ షాట్స్’ యాప్ నిర్వహిస్తున్న రాజ్కుంద్రాను అరెస్ట్ చేశారు. కుంద్రా వ్యవహారాల గురించి తనకు ఏమీ తెలియదని అంటున్న అతడి భార్య శిల్పా శెట్టి.. తాజా పరిణామాల నేపథ్యంలో అతడి నుంచి విడిపోవాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…