కొన్ని వారాల కిందట ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ రిలీజైనపుడు దగ్గుబాటి రానా గురించి చాలా మంది రకరకాలుగా ఫీలైపోయారు. ఈ సినిమా ఒరిజినల్ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్లో లీడ్ రోల్స్ చేసిన ఇద్దరు నటులకూ సమాన ప్రాధాన్యం కనిపిస్తుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ను హైలైట్ చేయడం కోసం రానా పాత్రకు బాగా ప్రాధాన్యం తగ్గించేశారన్న ఫీలింగ్ కలిగింది చాలామందికి. టైటిల్లో రానా పాత్ర పేరు రాకుండా ‘భీమ్లా నాయక్’ అని పవన్ క్యారెక్టర్ నేమ్ ఒకటే పెట్టడంతోనే అన్యాయం జరిగిపోయిందని అన్నారు.
ఇక ఫస్ట్ టీజర్లోనూ రానాకు స్కోప్ లేకుండా పవన్ మీదే తీర్చిదిద్దడం.. ఆ తర్వాత ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. రానా ఈ సినిమా ఒప్పుకుని తప్పు చేశాడని అతడి ఫ్యాన్స్ ఫీలవడం.. పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ వారిని మరింత రెచ్చగొట్టడం కనిపించింది సోషల్ మీడియాలో.
ఐతే లేటెస్ట్గా రిలీజ్ చేసిన డానియల్ శేఖర్ క్యారెక్టర్ టీజర్ చూశాక ఆ సందేహాలన్నీ పటాపంచలు అయిపోయాయి. భీమ్లా నాయక్ టీజర్కు ఏమాత్రం తగ్గని రీతిలో, ఇంకా చెప్పాలంటే మరింత ఇంట్రెస్టింగ్గా ఈ టీజర్ను తీర్చిదిద్దారు. భీమ్లా టీజర్ పూర్తిగా పవన్ ఆకర్షణ మీద నడిచింది. కానీ డానీ క్యారెక్టర్ టీజర్లో ఆ పాత్ర చాలా ఆసక్తికరంగా కనిపించింది. రానా స్క్రీన్ ప్రెజెన్స్.. అతడి లుక్స్.. యాటిట్యూడ్ కూడా బాగా ప్లస్ అయ్యాయి. రానా టీజర్కు వస్తున్న రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు.
24 గంటల్లోపే 5 మిలియన్ వ్యూస్ దాటేసింది ఈ టీజర్కు. పవన్ ముందు రానా ఏం నిలుస్తాడులే అనుకున్న వాళ్లకు అతడి సత్తా ఏంటో తెలుస్తోంది. రానా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపున్న నటుడు కావడంతో ఈ టీజర్కు రెస్పాన్స్ కూడా ఓ రేంజిలో ఉంది. నిన్నటిదాకా రానా గురించి తక్కువ అంచనా వేసిన వాళ్లు, అతడి టీజర్ విషయంలో లైట్ అన్న వాళ్లందరూ కూడా ఇప్పుడు అభిప్రాయం మార్చుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్, రానా మధ్య ఎపిక్ క్లాష్ చూడబోతున్నట్లే కనిపిస్తోంది.
This post was last modified on September 21, 2021 3:50 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…