ఇన్‌సైడ్ టాక్ : మహేష్ కి కథ సెట్ అవ్వలేదట!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు. మహేష్ కోసం రాజమౌళి జేమ్స్ బాండ్ లాంటి కథ రెడీ చేశారని వార్తలొచ్చాయి. రీసెంట్ గా రాజమౌళి ఈ సినిమా కోసం ఓ ఇంగ్లీష్ నవల హక్కులను కొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి ఇప్పటివరకు మహేష్ కి కథ సెట్ చేయలేదట.

నిజానికి రాజమౌళి-మహేష్ బాబుల మధ్య ఇప్పటివరకు కథకు సంబంధించి చర్చలు జరిగాయి. రాజమౌళి రెండు, మూడు లైన్లు మహేష్ కి వినిపించాడు. అయితే అందులో ఏ ఒక్కటీ కూడా మహేష్ ని సంతృప్తిపరచలేకపోయింది. దీంతో మహేష్.. సినిమా చేయడానికి చాలా సమయం ఉందని, ఆలస్యమైనా పర్లేదు టైమ్ తీసుకొని స్టోరీ రెడీ చేయమని రాజమౌళికి చెప్పారట. రచయిత విజయేంద్రప్రసాద్ కొన్నాళ్లుగా ఈ కథపైనే వర్క్ చేస్తున్నారు.

ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్న మహేష్ బాబు ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఇది పూర్తి కావడానికి మరో సంవత్సరం ఈజీగా పడుతుంది. అలా చూసుకుంటే 2022 చివరికి కానీ రాజమౌళి-మహేష్ సినిమా పట్టాలెక్కదు. ఈలోగా.. రాజమౌళి బాలీవుడ్ లో చిన్న సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి. ఆ సినిమా పూర్తయ్యేలోపు మహేష్ సినిమా కథ రెడీ చేస్తే సరిపోతుంది.