ఆమిర్ ఖాన్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ ఒక తెలుగు సినిమాకు సంబంధించిన వేడుకలో పాల్గొంటాడని ఎప్పుడైనా ఊహించామా? కానీ ఈ ఆదివారం ఈ ఆశ్చర్యకర దృశ్యం చూడగలిగాం. అక్కినేని నాగచైతన్య ఈ అదృష్టాన్ని దక్కించుకున్నాడు. ఆమిర్ కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూ ఓ ప్రత్యేక పాత్ర పోషించడం.. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం ఏర్పడటం.. చైతూపై ఆమిర్కు చాలా మంచి అభిప్రాయం ఏర్పడటంతో తన కోసం హైదరాబాద్ వరకు వచ్చి ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు ఆమిర్.
ఐతే ఆమిర్తో పెరిగిన పరిచయాన్ని ఉపయోగించుకుంటూ.. కొంచెం మొహమాటంగా అయినా చైతూనే తన సినిమా ప్రమోషన్ కోసం ఆయన్ని ఈ ఈవెంట్కు రప్పించి ఉంటాడని చాలామంది అనుకున్నారు. కానీ అది నిజం కాదు. స్వయంగా ఆమిర్ ఖాన్ తనంతట తాను ఈ వేడుకకు వచ్చాడు. ఈ విషయాన్ని ఇటు ఆమిర్, అటు చైతూ ధ్రువీకరించారు కూడా.
మూణ్నాలుగు రోజుల కిందట తాను ‘లవ్ స్టోరి’ ట్రైలర్ చూశానని.. అది తనకు చాలా నచ్చిందని.. దీంతో తనకు తానుగా ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్కు వచ్చానని ఆమిర్ చెప్పాడు. నాగచైతన్య మంచి నటుడే కాదు.. ఎంత మంచి వ్యక్తో అతడి తల్లిదండ్రులతో పాటు అభిమానులందరికీ చెప్పాలన్న ఉద్దేశం కూడా తాను ఇక్కడికి రావడానికి కారణమని ఆమిర్ తెలిపాడు.
మరోవైపు చైతూ మాట్లాడుతూ.. ‘లవ్ స్టోరి’ ట్రైలర్ చూసి ఆమిర్ తనకు మెసేజ్ పంపాడని.. అప్పుడే క్యాజువల్గా ఈ ఆదివారం ఎక్కడుంటావని అడిగాడని.. ఇలా ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఉందని తాను చెప్పానని.. అలా చెప్పగానే తాను ఆ ఈవెంట్కు వస్తానని ఆమిర్ అన్నాడని.. ఆయన ఈ వేడుకలో పాల్గొనడం ఇంకా నమ్మలేక పోతున్నానని చైతూ చెప్పాడు. ‘లాల్ సింగ్ చద్దా’ కోసం 45 రోజుల పాటు ఆమిర్తో పని చేసిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని.. ఈ అనుభవం తన జీవితాంతం ఒక పాఠంగా ఉపయోగపడుతుందని చైతూ అన్నాడు.
This post was last modified on September 20, 2021 7:20 am
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…