Movie News

ఆ హీరోయిన్ తప్పుకోవడంలో ఆశ్చర్యమేముంది?


మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ కేరళలో రిలీజైన కొన్ని రోజులకే తెలుగు రీమేక్ హక్కులు తీసేసుకుంది సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఇక అప్పట్నుంచి ఈ సినిమాలో లీడ్ రోల్స్ ఎవరితో చేయించాలనే విషయంలో చాలా సందిగ్ధతే నడిచింది. రకరకాల పేర్లు వినిపించాయి. చివరికేమో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలకు ఖరారయ్యారు. ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో సందిగ్ధత మొదలైంది. ముందు పవన్‌కు జోడీగా సాయిపల్లవి అన్నారు. తర్వాత ఆమె తప్పుకుంటే నిత్యా మీనన్‌తో ఆ పాత్రను రీప్లేస్ చేశారు.

ఇక రానాకు జోడీగా ముందు వినిపించిన పేర్లు వేరు. చివరికి తమిళ హీరోయిన్ అయిన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ను ఎంచుకున్నారు. ఈమెతో కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు.

ఐశ్వర్య స్థానంలోకి మలయాళ అమ్మాయి సంయుక్త మీనన్‌ను తీసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇది నిజమే కావచ్చు. అసలు ఈ సినిమా చేయడానికి ఐశ్వర్య ఎలా ఒప్పుకుందన్నదే అర్థం కాని విషయం. తమిళంలో కథానాయికగా ఆమెకు మంచి పేరుంది. చాలా వరకు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేసింది తను. ‘కనా’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతోనూ సత్తా చాటింది. అలాంటి అమ్మాయి రానాకు జోడీగా కథలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రకు ఒప్పుకోవడమే ఆశ్చర్యం.

ఒరిజినల్ చూసిన వాళ్లకు ఆ పాత్రకున్న ప్రాధాన్యం ఎలాంటిదో అర్థమై ఉంటుంది. చాలా నామమాత్రమైన క్యారెక్టర్ అది. అలాంటి పాత్రను ఐశ్వర్య చేయాల్సిన అవసరమే లేదు. ఐతే ఇందులో నిత్యా మీనన్ చేసిన పాత్రకు ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఓవైపు కెరీర్ చరమాంకంలో ఉన్న నిత్య అలాంటి పాత్ర చేస్తుంటే.. మంచి ఊపులో ఉన్న ఐశ్వర్య ప్రాధాన్యం లేని పాత్ర చేయాల్సిన అవసరమే లేదు. అందుకే కొంచెం లేటుగా అయినా ఐశ్వర్య సరైన నిర్ణయమే తీసుకుందని చెప్పాలి.

This post was last modified on September 19, 2021 3:29 pm

Share
Show comments

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

44 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago