పాన్ ఇండియా.. ‘బాహుబలి’ రిలీజైన దగ్గర్నుంచి ఫిలిం ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన మాట ఇది. ఏదో ఒక భాషలో కాకుండా ముఖ్యమైన భారతీయ భాషల్లో తెరకెక్కి దేశవ్యాప్తంగా రిలీజయ్యే సినిమాలను ‘పాన్ ఇండియా’ సినిమాలని అంటున్న సంగతి తెలిసిందే. ఐతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా.. ‘బాహుబలి’ని చూసి అత్యాశతో చాలామంది పాన్ ఇండియా సినిమాలు మొదలుపెట్టారు.
ఐతే వీటిలో చాలా వరకు పేరుకే పాన్ ఇండియా సినిమాలు. ఒక భాషలో తీసి మిగతా భాషల్లో అనువాదం చేయడం తప్పితే.. వేర్వేరు భాషల్లో ఏమీ సినిమా తీయట్లేదు. ఇక రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి బేసిగ్గా ఏ భాషలో తెరకెక్కిందో అక్కడ మాత్రమే సినిమా పెద్ద స్థాయిలో రిలీజవుతోంది. మిగతా భాషల్లో రిలీజ్, వసూళ్లు నామమాత్రంగా ఉంటున్నాయి. ఈ కోవలో చాలా సినిమాలు చూడొచ్చు. అయినా ఎవ్వరూ తగ్గట్లేదు. ఘనంగా పాన్ ఇండియా సినిమాలను అనౌన్స్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా తెలుగులో ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ‘హనుమాన్’ సినిమాను కూడా ‘పాన్ ఇండియా’ జాబితాలో కలిపేశారు. ఈ రోజు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా దీన్ని పాన్ ఇండియా మూవీగా ప్రకటించారు. ప్రశాంత్ వర్మ ఇప్పటిదాకా రూపొందించిన మూడు చిత్రాల్లో పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమా ఒక్కటీ లేదు. ‘అ!’ వినూత్న చిత్రంగా ప్రశంసలందుకున్నా కమర్షియల్ సక్సెస్ కాలేదు. ‘కల్కి’ అన్ని రకాలుగా నిరాశ పరిచింది. ‘జాంబి రెడ్డి’ డివైడ్ టాక్ తెచ్చుకుని ఓ మోస్తరుగా ఆడింది. ఆ చిత్ర హీరో తేజతోనే ‘హనుమాన్’ తీస్తున్నాడు ప్రశాంత్.
ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులనే పూర్తిగా మెప్పించే సినిమా తీయని ప్రశాంత్.. ఇప్పుడు ‘హనుమాన్’ను పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ చేయడం పట్ల కౌంటర్లు పడుతున్నాయి. ‘పాన్ ఇండియా’ అంటే అందరికీ కామెడీ అయిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ‘హనుమాన్’తో ప్రశాంత్ వీళ్లకు ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.
This post was last modified on September 18, 2021 7:00 pm
రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండదని చెబుతూ, ప్రభాస్ అభిమానులకు భరోసానిస్తూ, తేడా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…