పాన్ ఇండియా.. ‘బాహుబలి’ రిలీజైన దగ్గర్నుంచి ఫిలిం ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన మాట ఇది. ఏదో ఒక భాషలో కాకుండా ముఖ్యమైన భారతీయ భాషల్లో తెరకెక్కి దేశవ్యాప్తంగా రిలీజయ్యే సినిమాలను ‘పాన్ ఇండియా’ సినిమాలని అంటున్న సంగతి తెలిసిందే. ఐతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా.. ‘బాహుబలి’ని చూసి అత్యాశతో చాలామంది పాన్ ఇండియా సినిమాలు మొదలుపెట్టారు.
ఐతే వీటిలో చాలా వరకు పేరుకే పాన్ ఇండియా సినిమాలు. ఒక భాషలో తీసి మిగతా భాషల్లో అనువాదం చేయడం తప్పితే.. వేర్వేరు భాషల్లో ఏమీ సినిమా తీయట్లేదు. ఇక రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి బేసిగ్గా ఏ భాషలో తెరకెక్కిందో అక్కడ మాత్రమే సినిమా పెద్ద స్థాయిలో రిలీజవుతోంది. మిగతా భాషల్లో రిలీజ్, వసూళ్లు నామమాత్రంగా ఉంటున్నాయి. ఈ కోవలో చాలా సినిమాలు చూడొచ్చు. అయినా ఎవ్వరూ తగ్గట్లేదు. ఘనంగా పాన్ ఇండియా సినిమాలను అనౌన్స్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా తెలుగులో ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ‘హనుమాన్’ సినిమాను కూడా ‘పాన్ ఇండియా’ జాబితాలో కలిపేశారు. ఈ రోజు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా దీన్ని పాన్ ఇండియా మూవీగా ప్రకటించారు. ప్రశాంత్ వర్మ ఇప్పటిదాకా రూపొందించిన మూడు చిత్రాల్లో పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమా ఒక్కటీ లేదు. ‘అ!’ వినూత్న చిత్రంగా ప్రశంసలందుకున్నా కమర్షియల్ సక్సెస్ కాలేదు. ‘కల్కి’ అన్ని రకాలుగా నిరాశ పరిచింది. ‘జాంబి రెడ్డి’ డివైడ్ టాక్ తెచ్చుకుని ఓ మోస్తరుగా ఆడింది. ఆ చిత్ర హీరో తేజతోనే ‘హనుమాన్’ తీస్తున్నాడు ప్రశాంత్.
ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులనే పూర్తిగా మెప్పించే సినిమా తీయని ప్రశాంత్.. ఇప్పుడు ‘హనుమాన్’ను పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ చేయడం పట్ల కౌంటర్లు పడుతున్నాయి. ‘పాన్ ఇండియా’ అంటే అందరికీ కామెడీ అయిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ‘హనుమాన్’తో ప్రశాంత్ వీళ్లకు ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.
This post was last modified on September 18, 2021 7:00 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…