‘బిగ్ బాస్’ షో మీద ఉన్న విమర్శలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఈ షో ద్వారా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని, పైగా జనాల మనసుల్ని కలుషితం చేస్తుందని చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఈ షోను రద్దు చేయాలంటూ సీపీఐ నారాయణ లాంటి వాళ్లు కోర్టుకు కూడా వెళ్లడానికి సిద్ధపడ్డారు. అసలేముందీ షోలో అంటూ తేలికగా తీసిపడేసేవాళ్లు.. ఈ షోను అసహ్యించుకునే వాళ్లు చాలామందే ఉన్నారు.
ఐతే ఎవరు ఏమన్నా సరే.. ఇదొక బ్లాక్బస్టర్ షో అనడానికి ఎప్పటికప్పుడు రుజువులు కనిపిస్తూనే ఉంటాయి. ఈసారి బిగ్ బాస్ మొదలవడానికి ముందు అంతగా సందడి కనిపించకపోవడంతో షో గురించి నెగెటివ్ కామెంట్లు చేసిన వాళ్లు కూడా ఇప్పుడు ఐదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కు వచ్చిన జనాదరణ చూసి షాకవుతున్నారు. సెప్టెంబరు 5న, ఆదివారం ‘బిగ్ బాస్’ ఐదో సీజన్ ఆరంభం కావడం తెలిసిందే.
ఆ రోజు నాలుగున్నర గంటల పాటు లాంచింగ్ ఎపిసోడ్ సాగింది. ఎస్డీ, హెచ్డీ వెర్షన్లకు కలిపి ఆ రోజు ‘బిగ్ బాస్’ 18 టీఆర్పీ సాధించడం విశేషం. ఈ మధ్య బ్లాక్బస్టర్ సినిమాల ఫస్ట్ ప్రిమియర్స్కు కూడా ఇలాంటి రేటింగ్ రావట్లేదు. టీవీ షోల్లో వేటికీ కూడా ఆ స్థాయి రేటింగ్ రావట్లేదు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ లాంచింగ్ ఎపిసోడ్కు సైతం ఇంత రేటింగ్ రాలేదు.
నిజానికి ఈ సారి బిగ్ బాస్ ఆరంభానికి ముందు సోషల్ మీడియాలో హైప్ అంతగా కనిపించలేదు. ఎప్పట్లా పార్టిసిపెంట్ల గురించి ఊహాగానాలు.. చర్చోప చర్చలు కనిపించలేదు. దీంతో ‘బిగ్ బాస్’ మీద జనాలకు ఆసక్తి తగ్గిందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ గత ఆదివారం జరిగిన మారథాన్ లాంచింగ్ ఈవెంట్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించిందని టీఆర్పీని బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్టార్ మా ఈ వారం 1303 జీఆర్పీలతో ఇండియాలోనే టాప్ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ఒకటిగా నిలిచింది.
This post was last modified on September 16, 2021 2:22 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…