యువ కథానాయకుడు నితిన్ కొత్త సినిమా ‘మాస్ట్రో’ సెప్టెంబరు 17న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసిన ఈ చిత్రాన్ని హాట్ స్టార్ ఓటీటీ స్ట్రీమ్ చేయబోతోంది. ఐతే ఓటీటీల్లో వచ్చే సినిమాల రిలీజ్ టైమింగ్ తెలియక జనాలు తికమక పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కో ఓటీటీ ఒక్కోలా వ్యవహరిస్తుంటుంది. అమేజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్కు ముందు రోజే రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య స్ట్రీమింగ్ మొదలు పెడుతుంటుంది. మొన్న ‘టక్ జగదీష్’ చిత్రాన్ని ఏడు గంటలకే రిలీజ్ చేసేశారు.
హాట్ స్టార్ వాళ్లకు ఒక నిర్దిష్టమైన టైమింగ్ అంటూ ఉండదు. రిలీజ్ రోజు ఉదయం, మధ్యాహ్నం, ముందు రోజు అర్ధరాత్రి ఇలా రకరకాల టైమింగ్స్లో సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. దీంతో ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ టైం విషయంలో ప్రేక్షకులకు స్పష్టత కొరవడింది. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమ్ చేయబోతున్నట్లు సమాచారం.
శుక్రవారం ‘గల్లీ రౌడీ’ మూవీ థియేటర్లలో రిలీజవుతుండటంతో ఉదయం లేదా మధ్యాహ్నం తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తే బాగుండదని.. ముందు రోజు అర్ధరాత్రే స్ట్రీమింగ్ మొదలుపెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓటీటీ రిలీజ్ అయినా సరే.. ఒక రేంజిలో ‘మాస్ట్రో’కు ప్రమోషన్లు చేస్తున్న చిత్ర బృందం.. ఇంకో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రాన్ని థియేట్రికల్ ప్రిమియర్ ప్లాన్ చేసింది. గురువారం రాత్రి 8.30కి ప్రెస్, ఫిలిం సెలబ్రెటీలకు హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్లో ప్రిమియర్ షో ప్లాన్ చేశారు.
ఇలా ఒక ఓటీటీ సినిమాకు థియేట్రికల్ ప్రిమియర్ వేయడం టాలీవుడ్లో తొలిసారి అనే చెప్పాలి. అంటే ఓటీటీ షో పడటానికి ముందు ‘మాస్ట్రో’ టాక్ బయటికి వచ్చేస్తుందన్నమాట. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్ట్రో’ బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమన్నా, నభా నటేష్, నరేష్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.
This post was last modified on September 16, 2021 2:18 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…